AADIVAVRAM - Others

చదివే అలవాటు పెంచుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: పుస్తకాలు ఎందుకు చదవాలి?
జ: మానవ సమాజం నిర్మించకున్న విజ్ఞాన సంపదను వారసత్వంగా వర్తమాన సమాజానికి అందించేవి పుస్తకాలు. వీటిని చదవకుండా మానవ సమాజం అభివృద్ధి చెందదు.
ప్ర: పుస్తకాలు చదివితే అనుభూతి..?
జ: పుస్తకాలు చదవకుంటే జ్ఞానవృద్ధి అసంభవం. పుస్తకాలు తరగని సంపద. అక్షరమంటేనే నశించదని అర్థం. అదే నిజమైన సంపద. పుస్తకాలు చదివే అలవాటు నూతన తరాలకు అందించడం మన బాధ్యత. పుస్తకాలకు దూరమైన సమాజం మానవీయ విలువలు కోల్పోతుంది.
ప్ర: పుస్తకాలు ఎన్ని రకాలు..?
జ: మానవ జీవితంలోని అన్ని కోణాలను ఆవిష్కరించే క్రమంలో విద్య, విజ్ఞాన, సామాజిక, ఆధ్యాత్మిక , కాలక్షేప సాహిత్యంతో పాటు అనేక అంశాలపై పుస్తకాలు లభిస్తున్నాయి. ప్రతి మనిషికీ కొన్ని అవసరాలుంటాయి. ఆ అవసరాలను పుస్తకాలు విజ్ఞానాన్ని అందించడం ద్వారా తీరుస్తాయి, పరిపూర్ణం చేస్తాయి.
ప్ర: పుస్తకాల కథ ఏమిటి?
జ: అచ్చు యంత్రం కనుగొనడంతో ముద్రణ మొదలైంది. ముద్రణ ఆధునిక పోకడలకు పోతున్న కొద్దీ పుస్తకాల ప్రచురణ చాలా సులువైంది. 11వ శతాబ్దం నుండి మొదలైన తెలుగు సాహిత్యం తాళపత్ర గ్రంథాలతో వెలుగు చూసింది. మానవ నాగరికతతో సమాంతరంగానే పుస్తకాల చరిత్ర కూడా ఉంది.
ప్ర: విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంచడం ఎలా?
జ: ఇది చాలా ముఖ్యమైన అంశం. రానురాను చదివే ఆసక్తిని కోల్పోతున్న సందర్భంలో బుద్ధిజీవులు ఆందోళన చెందుతున్న సంగతి మనకు తెలిసిందే. డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో విజానంపై ఆసక్తి పెరిగింది. చదివే అలవాటు తగ్గింది. ఇది మానవ సంబంధాలను దెబ్బతీస్తోంది. పైగా ఎంత అవసరమో అంతే చదువుతున్నారు. ఇది మున్ముందు ప్రమాదకర ధోరణి కూడా. పుస్తకాలకు ప్రత్యామ్నాయం ఉండదనే అవగాహన విద్యార్థులకు కల్పించాలి. పుస్తక పఠనం తగ్గడంతో పిల్లలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో లీనవుతున్నారు. పుస్తకాలకు దూరమైన విద్యార్థులు పెడత్రోవ పడుతున్నారు. తాత్కాలిక ప్రయోజనాలు సమాజానికి ప్రమాదకరం. ముఖ్యంగా టీచర్లు, తల్లిదండ్రులు గొప్ప పుస్తకాల గురించి, వాటిని చదివి జీవితాలను మార్చుకున్నవాళ్ల గురించి పిల్లలకు చెప్పాలి. ఆత్మకథలు, జీవిత చరిత్రలు విధిగా చదివించాలి. విస్తృతంగా చదివిన అంబేద్కర్, నెహ్రూ , గాంధీ , పీవీ నర్సింహరావు లాంటి గొప్పవాళ్లను పిల్లలకు పుస్తకాల ద్వారా పరిచయం చేయాలి. పుస్తకాలు లేని ఇళ్లు, చెట్లు లేని ఇళ్లు ఇళ్లే కావని పిల్లలకు తెలియజెప్పాలి. బహుమతులుగా ఉత్తమ గ్రంథాలను అందజేయాలి.
ప్ర: పుస్తక ప్రదర్శన చరిత్ర ఏమిటి?
జ: నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా 1967 నుండి ప్రచురణ , పుస్తక ప్రదర్శన ప్రారంభించింది. ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించుకునేందుకు, రచయితలకు ప్రాచుర్యం కల్పించేందుకు, రాబోయే తరాలకు విజ్ఞాన ఆసక్తిని రగిల్చేందుకు పుస్తక ప్రదర్శనలు మొదలయ్యాయి. దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మొదలైన పుస్తక ప్రదర్శనలు ఈరోజు పట్టణాల్లో, గ్రామస్థాయిలో కూడా జరుగుతున్నాయి. పుస్తక ప్రదర్శనలకు వస్తున్న ప్రజానీకాన్ని చూస్తుంటే ఆశావహంగా అనిపిస్తోంది. అమ్మకాలు బాగుంటున్నాయి, విజ్ఞానాన్ని అందించే గ్రంథాలపై వివిధ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.
ప్ర: హైదరాబాద్ పుస్తక ప్రదర్శన గురించి...
జ: ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. అందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సమన్వయం చేస్తోంది. ప్రముఖ ప్రచురణ కర్తలు, దుకాణ దారులు కలిసి 1985లో మొదటిసారి సిటీ కేంద్రగ్రంథాలయంలో బుక్ ఫెయిర్ నిర్వహించారు. 1987లో సొసైటీని రిజిస్టర్ చేశారు
ప్ర: పుస్తక ప్రదర్శనల పురోగతి ఎలా ఉంది?
జ: ప్రపంచంలో అన్ని దేశాలూ వివిధ సందర్భాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. కొన్ని దేశాలు నిర్దిష్టంగా కొన్ని రోజుల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పుస్తకాల కొనుగోళ్లు, ప్రచురణలు చాలా గొప్పగా ఉన్నాయి. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పుస్తక ప్రదర్శన సందర్భంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, ప్రముఖుల ప్రసంగాలతో పండుగ వాతావరణం సంతరించుకుంటోంది. మార్పుకోరుకునే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో దర్శనమిస్తుంటారు.
ప్ర: రాష్ట్ర విభజన అనంతరం పుస్తక ప్రదర్శనలో మార్పులు..?
జ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు , తర్వాత కూడా హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు ప్రత్యేకత ఉంది, జాతీయ స్థాయిలో పేరు గడించింది. అత్యంత సంక్షుభిత సమయాల్లోనూ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను దిగ్విజయంగా నిర్వహించగలిగాం. అందరికీ అందుబాటులో ఉండటం మరో విశేషం.
ప్ర: తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ వికాసానికి హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఏ రూపంలో తోడ్పాటునిస్తోంది?
జ: పుస్తక ప్రదర్శనలకు హద్దులు లేవు.కాకపోతే ప్రదర్శన జరిగిన ప్రాంతంపై అక్కడ ప్రదర్శితమైన పుస్తకాల ప్రభావం. కవులు, రచయితలు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, సాంస్కృతిక వివేచనాపరుల ప్రభావం తప్పకుండా పడుతుంది. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన తప్పనిసరి తెలంగాణ దిశ, దశను మార్చడంలో తన వంతు పాత్రను ఏపుడూ పోషిస్తోంది. సాహిత్యం, సంస్కృతి అనేవి పరస్పర ఆధారితాలు. సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రధాన వాహిక అయిన సాంస్కృతిక బృందాలు మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్య, సాంస్కృతిక రంగాల పాత్ర //ఎంతో ప్రభావశీలమైంది. అన్ని రంగాల వికాసానికి పుస్తకాలు పునాదిగా ఉంటాయి.
ప్ర: ముద్రణా రంగంలో మార్పులు..?
జ: ముద్రణా రంగంలో పెనుమార్పులే సంభవించాయి. అక్షరాలను పేర్చుకునే దశ నుండి నేరుగా కంప్యూటర్లలో కంపోజ్ చేసుకోవడమే కాదు, ఫిల్ము చేయాల్సిన పని లేకుండా ముద్రణకు పంపించగలిగే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల నుండి ముద్రించుకునే వీలు కలిగింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పుస్తక ప్రచురణ చాలా సులువైంది. వేగవంతమైంది. ఆకర్షణీయమైన ముద్రణకు అవకాశం దక్కింది. ప్రచురణ కర్తలు నిరంతరం నూతన పోకడలతో తాజా సమాచారాన్ని అప్‌డేట్ చేసి ఇచ్చేందుకు వీలు కలిగింది.
ప్ర: డిజిటల్ విప్లవం ప్రభావం..?
జ: డిజిటల్ విప్లవం వాస్తవానికి ముద్రణ రంగానికి ప్రాణం పోసింది. అయితే మరో కోణంలో ఉపాధి అవకాశాలను తగ్గించింది. ముద్రణ రంగంపై ఆధారపడి జీవించేవారికి పనిలేకుండా అయిపోయింది. ఇపుడు అన్ని పనులూ యంత్రాలే చేస్తున్నాయి. డిజిటల్ విప్లవంతో ప్రచురణ మరింత తేలికైంది. ప్రింటింగ్ సులువైంది. క్వాలిటీ పెరిగింది. అందమైన ముద్రణ ఆకర్షించే స్థితికి డిజిటల్ విప్లవం తోడ్పాటు నిచ్చింది.
ప్ర: ఆధునిక పుస్తకం ఎలా ఉండబోతోంది?
జ: మనం సాంకేతికంగా ఎంత ఎదిగినా విజ్ఞాన సముపార్జనలో పుస్తకానిదే అగ్రస్థానం. చేతిలో పుస్తకం అమరినట్టు కంప్యూటర్లు ఒదగవు.ప్రయాణిస్తూ కూడా చదువుకునే వీలు పుస్తకంతోనే ఉంటుంది. వీలున్నపుడు ఇష్టం వచ్చిన రీతిలో చదువుకోవచ్చు.
ప్ర: పుస్తక ప్రదర్శనలపై ఆధునికత ప్రభావం ?
జ: ఆధునికత ఆరంభంలో వెర్రితలలు వేసినా, కొంతకాలానికి నిశ్చల స్థితికి చేరుకుంటుంది. యువత మళ్లీ పుస్తకాలను ఆశ్రయిస్తోంది. ఆధునికత ముప్పు పుస్తకాలకేమీ లేదు.
ప్ర: విద్య వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు ఏ విధంగా దోహదం చేస్తాయంటారు?
జ: ఒక్క తెలంగాణలోనే కాదు, ఏ ప్రాంతాన్నైనా చైతన్యం చేయడానికి ఉత్తమ అభిరుచిని వ్యాప్తి చేయడానికి పుస్తక ప్రదర్శనలు దోహదం చేస్తాయి.
ప్ర: తెలంగాణ చరిత్ర వక్రీకరణలను సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ: పరాయి పాలనలో చరిత్ర సాహిత్యం సహజంగానే వక్రీకరణకు గురవుతుంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చరిత్ర , సాహిత్యం పునర్నిర్వచించడం జరుగుతోంది. ప్రచురణ కర్తలు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ 31 జిల్లాల చరిత్రకు అక్షర రూపం ఇచ్చే పనికి పూనుకుంది. ఇదో ఆశావాహ ధోరణి.
ప్ర: హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఇతర కార్యక్రమాలు..?
జ: ‘బుక్ ఫెయిర్’లో పుస్తకాలు అమ్ముకోవడం అనేది చాలా చిన్న భాగం మాత్రమే. జ్ఞాన సముద్రాన్ని సందర్శకుల ముందు ఆవిష్కరించి, వాళ్లలో అభిరుచిని కలిగించడం, వాళ్లకు కావల్సిన సమాచార కేంద్రాన్ని గుర్తించేట్టు చేయడం, సదస్సులు, సమావేశాలతో చైతన్యాన్ని రగల్చడం, సాంస్కృతిక ప్రదర్శలు నిర్వహించడంతో పాటు పలు అంశాల్లో శిక్షణ కూడా కొనసాగుతుంది. అన్నింటికీ మించి పుస్తక ప్రేమికుల ‘నెట్‌వర్క్’ ఏర్పడుతుంది. కొత్త పుస్తకాలు ఏం వచ్చాయో, రచయితల భావనలు, ధోరణులు ఎలా ఉన్నాయో, సమాజం దిశ ఎటుగా సాగుతుందో వంటి అంశాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులకు పనికొచ్చే కొత్త పుస్తకాలు ఏం ఉన్నాయో అర్థం అవుతుంది.
*
జూలూరి గౌరీశంకర్
అధ్యక్షుడు, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కమిటీ