Others

పరమ పవిత్రం వైకుంఠ ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతమైన కాలం భగవత్ స్వరూపం. ప్రాచీనులు కాలాన్ని నాలుగు ప్రమాణాలతో సూచించారు. మాస చతుర్థా...‘‘సావన: సౌర చాంద్రో నాక్షత్ర ఇతి’’ అని నిర్ణయ సింధులో పేర్కొబడింది. సావనము, సౌరము, చాంద్రము, నాక్షత్రము ద్వారా గణించడం పరిపాటి. చైత్ర వైశాఖ మాసములు, ప్రతిపద విదియాది తిథులు చాంద్రమానం ప్రకారం లెక్కిస్తారు. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మాస నిర్ణయం చేయగా, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెల రోజులు సౌరమానం ప్రకారం మాసంగా గణిస్తారు.
సౌరమాన మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలి, అధికంగా ఆయా తేదీలలోనే వస్తాయి. అందుకే తమిళులకు ఏప్రిల్ 14ననే మేషారంభమై సంవత్సరాది వస్తుంది. నాగర ఖండ ఆధారంగా ‘‘రవే: సంక్రమణం రాశౌ సంక్రాంతి రిథి కథ్యతే’’. ఒక్కొక్క మాసము ఒకొక్క సంక్రాంతిగా చెప్పబడుతుంది. మకర సంక్రాంతి జనవరి 14నుండి కర్కాటక సంక్రాంతి జూలై 16వరకు ఉత్తరాయణం, తదాది మరల మకర సంక్రాంతి వరకు దక్షిణాయనంగా చెప్పబడింది. సౌరకాలమానం ప్రకారం ధనుస్సంక్రమణమైన మాసం దేవతలకు ఉష:కాలం. ‘‘బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత ధర్మార్థౌ చాను చింతయేత్’’అని స్మృతి చెపుతున్నది. దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం. మహా విష్ణువు ఆషాఢం మొదలుకుని, కార్తీకం వరకు నిద్రించి, సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించాక, విష్ణు సంబంధ శ్లోకాలచే మేల్కొలిపి అరుణోదయంలో ఉష:కాల శోడశోపచార పూజలు చేసి, పులగం - పొంగలి - శర్కర నివేదించాలి. నిర్ణయ సింధు కారుని ప్రకారం ఉదయానికి పూర్వం నాలుగు ఘడియలు, ఘడియ అనగా ఇరువై నాలుగు నిమిషాలు - గంటన్నరపై ఆరు నిమిషాలకు పూర్వము అరుణోదయం అగును. ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికానుసారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ‘‘గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్థ థైవచ; ఏకాదశ్యాంశ భుంజిత పక్షయోరు భయోరపి’’ అని అగ్ని పురాణాదులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించబడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన దివసము కావునే ఏకాదశి ‘‘హరి వాసరము’’గా కొనియాడబడుచున్నది. అందు సౌరమానము నందలి ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి (మార్గశీర్షము లేక పుష్య మాసం) ‘‘వైకుంఠ ఏకాదశి’’గా పిలువ బడుచున్నది. సూర్య చంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠ వాసునికి సౌర, చాంద్రమానాలలో ప్రశస్తమైన ధనుర్మా శుక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. ‘‘్ధనూరాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశి తిథౌ; త్రింషత్ కోటి సురై: సాకం బ్రహ్మ వైకుంఠ మాగత: పాలస్త్యేనని పీడితా: సురగణా: వైకుంఠలోకం యయు:; ద్వారే తత్ర విషాదభావ మనసా సూకె్తైర్ హరిం తుష్టువు: శుక్లై: శ్రీ:హరి వాసరే ప్రభాత సమయే భానౌ ధను: సంస్థితే, తేభ్యోదాత్ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవ:’’ రావణుని బాధలను తాళలేని దేవతలు బ్రహ్మను ఆశ్రయింపగా...ఆదేవుడు ధనుర్మాస శుక్ల ఏకాదశి దినమున దేవతలందరితో వైకుంఠమునుచేరి, హరి వాసరమునందు దేవతలు విషాద భావ మనస్కులై శ్రీహరిని వేదోక్తంగా స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శనమును కలుగజేసెనని వివరించబడినది. శ్రీప్రశ్న సంహిత నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభులను భగవానుడు సంహరించినపుడు వారు దివ్యరూపధారులై దివ్య జ్ఞానము పొందగా, బ్రహ్మాదులెవరైనను నీలోకము వంటి మందిరమును నిర్మించి, ఏకాదశి దినోత్సవమును గావించి, నిన్ను నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపింతురో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని మోక్షోత్సవ దినముగా వరమిచ్చినట్లు తెలియుచున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున ‘ముక్కోటి ఏకాదశి’గాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక ‘వైకుంఠ ఏకాదశి’గాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమైనందున ‘్భగవదవలోక దివసము’గ కొనియాడ బడుచున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494