Others

ఆంజనేయ వ్రతాచరణ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంజనేయస్వామి పూజలలో హనుమత్ వ్రతము ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ వ్రత విశిష్టత శౌనకాది ఋషులకు సూతమహాముని వివరించినట్లుగా పరాశర సంహితలో తెలియబరచబడినది.
ధీమంతుడైన హనుమ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున లోకమాతయైన సీతామాతను అశోక వనమందు చూచి ఆత్మహత్యనుండి విరమింపచేసి శ్రీరామచంద్ర ప్రభు క్షేమవార్తచెప్పి తన విశ్వరూపమును చూపెను. అప్పుడు సీతామాత హనుమంతుని మహారుద్రుడుగా భావించి అనేక విధముల స్తుతించెను. ఆమె మిక్కిలి సంతోషముతో ఈరోజున యెవ్వరైతే హనుమద్వ్రతమాచరించుదురో అట్టివారికి హనుమత్‌స్వామి సీతాదేవి అనుగ్రహించినది.
ఒకప్పుడు వ్యాస మహర్షి ద్వైత వనమనకు విచ్చేసి ధర్మరాజాది పాండవులను యోగక్షేమములు విచారించు సమయమున వారికి హనుమద్వ్రత మాచరించిన శుభములు బడయవచ్చని చెప్పి ఆ వ్రత విధానమును వివరించెను. పూర్వము శ్రీకృష్ణునిచే చెప్పబడగా ద్రౌపది యా వ్రతమాచరించి పదమూడు ముడులుగల తోరమును ధరించినది. అర్జునుడు పరిహసింపగా ద్రౌపది యాతోరమును విడిచివేసెను. ఆరోజునుండి పాండవులకు అరణ్యవాసము 12 సంవత్సరములు, ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలసి వచ్చినది. ధర్మరాజా ఈ వ్రతమాచరించిన యెడల నీకు శుభములు కలుగునని చెప్పిన పాండవులు, ఆ వ్రతమాచరించి తిరిగి సంవత్సరములో రాజ్యసుఖములు పొందగలిగి ఈ వ్రతమును శ్రీరామచంద్ర ప్రభువు, సుగ్రీవుడు యథావిథిగా ఆచరించెను. రావణ సంహారము శ్రీరామ పట్ట్భాషేకములు దిగ్విజయముగా జరిగినవని శాస్త్రప్రమాణము.
పూర్వము సోమదత్తుడనే రాజు, తన విశాలమైన సామ్రాజ్యమును పరిపాలించు సమయమున తన చుట్టూవున్న శతృరాజులు అందరు కలసి గుమిగూడి సోమదత్తుని ఓడించి రాజ్యమును కైవసము చేసుకొనిరి. భార్యతోగూడ అడవుల పాలైన సోమదత్తుడు గార్గ్యాశ్రమును చేరినవాడాయెను. మునీశ్వరుని దయతో ఆంజనేయ వ్రతమాచరించి తిరిగి సమస్త సామ్రాజ్యమును జయించినవాడై, ఏకచ్ఛత్రాధిపత్యముతో నూరు సంవత్సరములు పాలించి పుత్రపౌత్రులతో సుఖసంతోషములతో వర్ధిల్లి అంత్యమందు బ్రహ్మలోకమును చేరినవాడాయెను.
ఒకప్పుడు విభూషణుడు సర్వసంపదలతో తులతూగుచు లంకా రాజ్యమేలు చుండెను. విభీషణుని కుమారుడు నీలుననువాడు తనకు చింతామణి, కామధేనువు కావలెనను కోరికతో రాక్షస గురువైన శుక్రాచార్యుని ప్రార్థించి ప్రసన్నుని చేసుకుని తన కోరికను తెలిపెను. అందుకు ఈ పని నా శక్తికి మించినది. నీవు హనుమద్వ్రతమాచరించి స్వామిని ప్రసన్నుని చేసుకొనిన యెడల ఆయనే నీ కోర్కె తీర్చగలడని శెలవిచ్చెను. ఆ ప్రకారము హనుమద్వ్రతమాచరించి ఇంద్రాది దేవతలతో ప్రచండ యుద్ధముచేసి జయించి, స్వామిదయతో తాను కోరుకున్న చింతామణి, కామధేనువు, కల్పవృక్షములనేగాక దేవతా స్ర్తిలలో శ్రేష్టమైన రూపయవ్వన లావణ్యములతో మొప్పారు వనసుందరిని గూడ బహుమతిగా పొంది తిరిగి తన లంకకేతెంచి సుఖసంతోషములతో తులతూగెనని హనుమద్వ్రత కథ ద్వారా తెలియుచున్నది.
దేవుళ్లకు దేవుడైన హనుమని ఆరాధించి సకలైశ్వర్యములు పొందవలెనని పెద్దల కోరిక హనుమంతుడు ఒక్కడే దేవుడని, హనుమన్మంత్రమొక్కటే శరణ్యమని భక్తుల భావన.

లక్కరాజు వెంకట పూర్ణచంద్రరావు (హనుమదుపాసకులు)