Others

ఆర్థిక సంస్కరణల పితామహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు పీవీ వర్ధంతి)
భా రత ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించిన తొలి దక్షిణాత్యుడు, ఒకేఒక తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు. 1921 జూన్ 28న జన్మించి, 2004 డిసెంబర్ 23న మరణించారు. పివిగా లబ్దప్రతిష్ఠులైన ఆయన బహు భాషావేత్త, రచయిత. స్నాతకోత్తర న్యాయశాస్త్ర పారంగతుడు. అపరచాణుక్యునిగా పేరొందారు. భారత ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకుని భారత ఆర్థిక సంస్కరణల పితామహునిగా పేరొందిన మేధావి. నిజాం వ్యతిరేక పోరాట యుద్ధ తంత్ర నిపుణునిగా, చివరకు 1947 ఆగస్టు 15న కూడా అటవీ క్షేత్రంలో పోరాట క్రమంలోనే ఉన్నారు. 1957లో శాసనసభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన పివి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, చివరకు ప్రధానిగా తన మేధాశక్తితో క్రమానుగతంగా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞుడాయన. కాంగ్రెస్ హయాంలో పూర్తి సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాకచక్యంతో, చాణక్య నీతితో పూర్తికాలం నడిపించారు. 1957లో మంథని నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా నాలుగుసార్లు గెలిచారు. 1962లో మొదటిసారి రాష్ట్ర మంత్రియై, 62 నుండి 64 వరకు న్యాయ, సమాచార మంత్రిగా, 64నుండి 67వరకు దేవాదాయ, న్యాయ; 67లో వైద్య, ఆరోగ్య, 68 నుండి 71 వరకు న్యాయ, సమాచార శాఖలను నిర్వహించారు. (71 సెప్టెంబర్ నుండి 73 జనవరి వరకు) ముఖ్యమంత్రిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. పీఠం అధిష్ఠించగానే అసమ్మతి. ఈ విషయమై అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీ - హైదరాబాద్‌ల మధ్య తిరిగేందుకే ఆయనకు సమయం సరిపోయింది. పట్టణ భూ గరిష్ఠ చట్టాన్ని తెచ్చిందీ ఆయనే. తర్వాత ఆయన కార్యక్షేత్రం ఢిల్లీకి మారింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా, మొదటిసారి హన్మకొండనుండి లోకసభకు ఎన్నికైనారు. ఎనిమిది, తొమ్మదివ లోకసభలకు రాంటెక్ నుండి ఎన్నికైనారు. నంద్యాల ద్వారా ఉప ఎన్నికలో పోటీ లేకుండా 5లక్షల పైచిలుకు మెజార్టీతో గిన్నీస్ రికార్డు సృష్టించి, ఎన్నికై 10వ లోకసభలో అడుగిడి, 1980-81కాలంలో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, మానవవనరుల అభివృద్ధి శాఖలు చేపట్టారు. రాజీవ్ హత్య కారణంగా, 1991లో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండానే దేశ 10వ ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా ఆయన హయాంలో ఎన్నో మలుపులు...అవినీతి ఆరోపణలూ ఎదుర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం చేపట్టిన సంస్కరణలు, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక శాస్తవ్రేత్తగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ను పిలిచి దేశ ఆర్థిక మంత్రిని చేయడం ఆయనకే చెల్లింది. 1992లో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కంప్యూటర్ ఆధారిత వ్యాపార పద్ధతిని ప్రారంభించారు. పంజాబ్ తీవ్రవాదాన్ని అణచి వేసిందీ ఆయన ప్రభుత్వమే. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు, వారి డిమాండ్లను లెక్కపెట్టక బందీలను విడిపించిన ఘనతా ఆయనదే. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయట పెట్టి ఆగ్నేయాసియా దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండడం పివి ప్రభుత్వ సాధించిన విజయమే. బహుభాషా పండితులు, 17్భషలలో అలవోకగా, మాట్లాడ గలిగిన మేధావి. 1940లో తన సోదరులతో కలిసి కాకతీయ పత్రికలో ఎన్నో వ్యాసాలు రాసారు. 1948నుండి 51వరకు కాకతీయ పత్రిక సంపాదకునిగా పని చేశారు. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలను సహస్రఫణ్ పేరుతో హిందీ అనువాదం చేసి జ్ఞానపీఠ అవార్డు పొందారు. 1968-74 మధ్య తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఉన్నారు. 1983లో స్పానిష్ భాషలో ప్రసంగించి, అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో క్యూబా అధ్యక్షులు ఫీడెల్‌ను అబ్బుర పరిచిన గొప్పతనం ఆయనది. నిరాడంబరుడు, తన పిల్లలను సైతం ప్రధాని కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయితీ పరుడు, చివరి దశలో కోర్టులకు తిరగడానికి ఆస్తులను అమ్ముకున్న వ్యక్తి. 2004 డిసెంబర్ 23న తుది శ్వాస వదిలారు. తెలంగాణలో పివి జయంతిని కేసిఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయం....

-సంగనభట్ల రామకిష్టయ్య....9440595494