Others

సంస్కరణాభిలాషి, తాపసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా..
*
భారతీయ జాతీయతపై రామకృష్ణ పరమహంస ప్రభావం అలేఖ్యం. హిందూమతంలోని మూఢనమ్మకాలు, అధిక సంప్రాదాయాలను కొంతవరకు తొలగించి, హిందూమతాన్ని ఇస్లాం, క్రైస్తవ మతాల సవాళ్లకు ధీటుగా నిలబెట్టిన మహనీయుడు రామకృష్ణుడు. అన్ని మతాల సారాన్ని ఆమూలాగ్రంగా ఆస్వాదించడం లక్ష్యంగా అవిరళ కృషి చేసి సిద్ధి పొందిన తాపసి ఆయన. అన్ని మతాలు భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవ రీత్యా మొదటి సారి ప్రపంచానికి చాటి చెప్పిన ఆధ్యాత్మిక గురువు. 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో కామార్పుకూర్ గ్రామంలో ధార్మిక పేద బ్రాహ్మణులైన క్షుదీరాం, చంద్రమణీ దేవికి జన్మించారు. బాల్యంనుండీ ప్రకృతి ఆరాధకునిగా, సాధు సజ్జన ప్రసంగాలలో ఆసక్తి కనబరుస్తూ, వారికి సేవలందించేవాడు. ఉపనయనం కాగానే మొదటి భిక్ష ఒక శూద్ర యువతి వద్ద పొందుతానని మాటిచ్చి, పట్టుబట్టి, ఎందరు చెప్పినా వినక, యువతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, సాంప్రదాయ మార్పుకు శ్రీకారం చుట్టాడు. తండ్రి మరణానంతరం పెద్దన్న రాంకుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ, పౌరోహిత్యం చేస్తున్న క్రమంలో, రాణి రాషమొణి అనే యువతి దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించగా, రాంకుమార్ పూజారిగా, రామకృష్ణుడు దేవతను అలంకరించేవారు. రాంకుమార్ మరణించాక ఈయనే పూజారిగా మారాడు. గుడిలో ఉన్నది రాతి విగ్రహమా? లేక సజీవమా తెలుసుకునేందుకు రేయింబవళ్ళు చేసిన కఠోర ప్రార్థన ద్వారా అమ్మవారి దర్శనభాగ్యం కలిగింది. మనిషికి చేసేలాగే విగ్రహానికి సేవలు చేసేవాడు. అన్ని మతాల పరమ సత్యాన్ని గ్రహించాడనే ప్రచారంతో అన్ని మతాలవారూ ఆయన దర్శనానికి వచ్చేవారు. తోతాపురి అనే సాధువు అద్వైతాన్ని బోధించారు. తద్వారా మూడు రోజులలోనే నిర్వికల్ప సమాధిని పొందిన మహనీయుడు. భగవత్, ఆత్మసాక్షాత్కారం పొంది, తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాల సాధన ద్వారా ఫలితం పొందారు. తాను చనిపోయే ముందు తన ఆధ్యాత్మిక శక్తులన్నీ వివేకానందునికి ధారవోసి, 1886 ఆగస్టు 16న మహాసమాధిని పొందారు. స్వార్థం నుండి విడివడితే భగవంతుడిని పొందవచ్చునని ఆయన నిరూపించి చూపారు.

- సంగనభట్ల రామకిష్టయ్య