Others

కార్పొరేట్ క్రమశిక్షణకు విద్యార్థులు బలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాపారాలు వేరు, విద్య మరియు వైద్యం వేరు. కానీ నేడు ఈ రెండు దేశంలోనేకాక రాష్ట్రాలలో కూడా మంచి లాభాలను అర్జించే ఆర్థిక వనరులు. మరి ముఖ్యంగా విద్య. తల్లిదండ్రులు వారి పిల్లలను డాక్టరో, ఇంజనీరో చేయాలనే సంకల్పమే కార్పొరేట్ సంస్థలకు వరంగా మారింది. కార్పొరేట్ క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు ఓ ఆదివారం ఉండదు, ఓ పండగ ఉండదు. క్రీడలుండవు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవు. ప్రతిక్షణం చదువే. వేలమంది విద్యార్థులు హాస్టళ్ళలో జైలు జీవితంకన్నా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారనేది జగమెరిగిన సత్యం. కన్నతల్లిదండ్రులే తమ పిల్లలను వారానికో, నెలకో ఒక్కసారి 5 నిమిషాలు కలిసి రావలసిన పరిస్థితిని వారు ‘కొని’ తెచ్చుకుంటున్నారు. ర్యాంకులే విద్యార్థుల జీవితాలను నిలుపుతాయనే భ్రమలో చాలామంది తల్లిదండ్రులు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు నిరంతరం పోటీపడుతూ, ఈ నాటకీయ చదరంగంలో వారిని పావులుగా మారుస్తున్నారు. చాలామంది విద్యార్థులు రోజులో ఏదో ఒక క్షణంలో శారీరకంగా, నీరసిస్తూ.. మానసికంగా కుంగిపోతున్నారనేది వాస్తవం. ఈ విషయాలు ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఇవేవీ ర్యాంకులు సాధించలేవు కదా?!
ప్రాథమిక స్థాయిలోనే పోటీ పరీక్షల కోచింగ్ అవసరమా?
విద్యావ్యవస్థలో అతిముఖ్యమైన స్థాయి ప్రాథమిక స్థాయి. ఈ స్థాయిలోనే కార్పొరేట్ స్థాయి ప్రబలిపోతున్న తరుణంలో విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంటుందో విద్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరమున్నది. ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ ప్రపంచం నుండి నైపుణ్యాలు కలిగిన ఆహ్లాదకరమైన విద్యావ్యవస్థను ఏర్పరచుటకు కృషిచేయాలి. విద్యార్థికి ఈ ప్రాథమికస్థాయిలో సబ్జెక్టుల పట్ల కీలక భావనలు, క్షేత్రస్థాయి విషయాలను నేర్చుకునే సామర్థ్యం అప్పుడప్పుడే మొదలవుతుంటుంది. ఇలాంటి సమయంలో ఐఐటి, ఎంసెట్, జేఈఈ లాంటి దేశంలో, రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన పరీక్షలకు కోచింగ్‌లు ఇస్తాం అంటే తల్లిదండ్రులు ఎలా నమ్ముతున్నారో అర్థం అవ్వడం లేదు. ఈ వాతావరణం ప్రాథమిక స్థాయినుండి మొదలై ఇంటర్ స్థాయిలో చాలా బలంగా వ్యాపించి ఉన్నది. మంచి ఆర్థిక కార్యకలాపంగా ఇంటర్ విద్య, కార్పొరేట్‌లో నిలిచిందనేది సత్యం. తద్వారా వ్యాపారదృష్టితో విద్యనుచూడడంవల్ల మంచి మానవత విలువలు కలిగిన, ఉన్నత ఆశయాలు కలిగిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, లెక్చరర్‌లకు వారి మనస్సుకు, యాజమాన్యాలు వారి స్వంత కార్పొరేట్ నిబంధనలతో బంధిస్తున్నారనేది నిజం. ఈ నిబంధనల చట్రంలో అటు విద్యార్థులు, ఇటు బోధన సిబ్బంది బాధలు ఎదుర్కొంటున్నది వాస్తవం. తద్వారా, బోధన సిబ్బందికి స్వేచ్ఛ లేక విద్యార్థులను యాజమాన్యాల నిబంధనలకు తలొగ్గి విద్యార్థులను ‘బట్టీరాయుళ్ళు’గా మార్చవలసి వస్తుంది. నిజానికి విద్యార్థులనుండి కోరవలసినది విద్యార్థి (ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్) అన్ని అంశాలలో సమగ్రమైన విషయాత్మక మరియు పరిశీలనాత్మక అభివృద్ధిగానీ, పాఠశాల మరియు కళాశాలల ప్రచురణ పాంప్లెంట్స్‌లో ఫొటోలు కావు.
ప్రభుత్వం దృష్టిపెట్టాలి... 1) ప్రభుత్వ సంస్థ అయినా, ప్రయివేట్ సంస్థఅయినా... ఎక్కడ చదువుతున్నా విద్యార్థి విద్యార్థే కాబట్టి, షెడ్యూల్ అనేది పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా విద్యార్థులకు తరగతులను నిర్వహించే వారిపట్ల కఠినంగా వ్యవహరించవలసి ఉంది.
2) విద్యార్థులకు ఆటలను పాఠశాలలు అందిస్తున్నాయా? లేదా? అనే అంశాన్ని కూడా పర్యవేక్షించాలి. ప్రతి 3 నెలలకు ఒకసారైనా ప్రభుత్వం వారే అన్ని రకాల విద్యాసంస్థలవారికి ఆటల పోటీలను నిర్వహించాలి.
3) చాలా పక్కాగా ప్రతి పాఠశాలలో కోకర్రిక్యులార్ ఆక్టివిటీస్ అమలు అయ్యేట్లుగా చర్యలు చేపట్టాలి.
4) ప్రాథమిక స్థాయిలో విద్య మాతృభాషలో జరిగేటట్లుచూడాలి. మరియు దీనికి సంబంధించిన పాఠ్యప్రణాళికలు, పుస్తకాలు ప్రభుత్వం వారే రూపొందించి, ప్రయివేట్ సంస్థలు కూడా వీటినే బోధించేటట్లు చేయాలి.
5) పాఠశాలస్థాయిలోని 8వ తరగతిలోనే వృత్తివిద్య కోర్సులను ప్రారంభిస్తే, చదువులో రాణించలేని విద్యార్థులు వృత్తివిద్యలో రాణించే అవకాశం ఉంటుంది.

- సూరం అనిల్, 9059457045