Others

ధర్మాచరణకు ప్రారంభ వేదిక ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢ శుద్ధ ఏకాదశినే ‘తొలిఏకాదశి’గా అంటారు. పూర్వకాలమందు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సర ప్రారంభంగా భావించేవారు. ఈ రోజును ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు ఈ రోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశివరకు యోగనిద్రలో ఉంటాడని పురాణాలు చెబుతాయ. యతులు గోవు పొదుగు నుంచి పాలు పితికినంత సమయం కూడా ఒక్కచోట ఉండకూడదనే నియమాన్ని కలిగి ఉంటారు కనుక- వారంతా ఈ నాటినుంచి ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్త్తిక శుద్ధ ఏకాదశి ‘ఉత్థాన ఏకాదశి’ వరకు ఆ నాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతం చేస్తారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమే కాదు, సంసారులు, వయో లింగభేదము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరించడం కూడా అక్కడక్కడా కనిపిస్తుంది.
ఈ తొలి ఏకాదశినాడు గోపద్మవ్రతం కూడా సంప్రదాయం. గోమాత సకల దేవీ దేవతల స్వరూపంగా హైందవులు భావిస్తారు. ఒక్క గోవును పూజిస్తే సర్వదేవతలు సంతోషప డుతారని అంటారు. ప్రతిరోజు చేసే గోపూజను ఈ ఏకాదశిన విశేషంగా చేస్తారు. గోశాలను కడిగి అక్కడ బియ్యపు పిండితో ముప్ఫై మూడు పద్మాల ముగ్గులు పెట్టి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆ పద్మములపైనుంచి వారిని విధి విధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క అప్పడాన్ని వాటిపై ఉంచి, ఆ అప్పడాలను, వాయనాలను, దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణుని సంతుష్టునిగావించి, గోమాతను పూజించువారికి సకలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. పైవిధంగా గోపద్మవ్రతం చేయాలి.
గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్ములయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీ దేవతలు, నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణ భాగమున వరుణ కుబేరులు, వామభాగమునందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మి, పాదాగ్రంబున ఖేతరులను, అంబా అంబా అంటూ అరిచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా పురాణాలు చెబుతాయ కనుకనే గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని, గోమాతకు ఇంత పుణ్యస్థానమిస్తూ అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నోగాథలున్నాయి.
ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలచినవారు, దశమినాడు రాత్రి నిరాహారులై ఉండి, ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్ర్తి సాంగత్యం పనికిరాదు. కానిపనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఇతరులకు కీడు చేయరాదు. సర్వులలోను శ్రీమన్నారాయణుడినే దర్శనం చేసుకోవాలి.
ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయానే్న కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి పారణ చేయాలి. పురాణ పురుషులు ఎంతో మంది ఈ ఏకాదశి వ్రతం చేసి అవ్యక్తమైన భగవంతుడిని వ్యక్తరూపంలో దర్శనం చేసుకొన్నారు.
ఏకాదశిన అన్నం తినకుండా ఉపవాసం చేయమనడంలో కారణం- విష్ణువు వరంవల్ల అన్నంలో దాగిన పాపపురుషుడేగాక బ్రహ్మసాల ప్రదేశం నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినపుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించువారి అన్నంలో నివసించుమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి వుంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి, అనారోగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయ. ఇది నిజమైనా కాకపోయనా పదిహేను రోజులకొకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని నేటివైద్యులు చెబుతు న్నారు. భక్తితోను, అంతరార్థం అర్థం ఛేసు కొనో ఏకాదశినాడు ఉపవాసమూ, భగవం తుని భజన చేస్తే సర్వజనులు సంతోషంగా ఉంటారు. సత్యధారణ, ధర్మాచరణ ఒక్కరోజు నుంచి ప్రతిరోజు చేయాలన్న భావన కూడా మనుష్యుల్లో ఏర్పడుతుందని, ఆభావనే అలవాటుగా మారుతుందని ఆశావహులైన కొందరు అంటారు.

- చివుకుల రామమోహన్