AADIVAVRAM - Others

శమయతే పాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ’’ ...్భరత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ఫ్రాధాన్యత కల్పించ బడింది. శమీకే ‘‘అపరాజిత’’ అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే ‘‘విజయ’’ నామాంకితయైన జగజ్జనని. అపరాజితా దేవి విజయానికి అధిదేవత. శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా, దుర్గామాతను తొమ్మిది రోజులుగా కొలిచినట్లయితే సర్వ శక్తులు సమకూరి, విజయ దశమినాడు విజయం చేకూరగలదని భక్తుల, ఆధ్యాత్మిక కార్యానురక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులకై దసరా నవరాత్రి ఉత్సవాలలో ముగింపుగా విజయ దశమి పర్వ దినాన శమీ (జమ్మి) వృక్షాన్ని పూజించి, సర్వాభీష్ఠ సిద్ధికై ప్రార్థించడం ప్రాచీన కాలంనుండి అనుసరిస్తున్న సత్సాంప్రదాయం. పూర్వకాలంలో రాజులు తమ విజయ యాత్ర సన్నాహక కార్యక్రమాలుగా ‘‘అగ్నిపూజ, గుర్రాలు, ఏనుగులు’’ మొదలైన వాటికి కొన్ని అర్చనలు చేయడాన్ని ఆచరించారు. దానిలో భాగంగానే శమీవృక్ష పూజ చేసి, యుద్ధానికి వెళ్ళేవారు. సంబంధిత కొన్ని విశేషాలను కాళిదాసు రఘువంశ మహా కావ్యమందు నాలుగవ సర్గలో సూచించారు. యజ్ఞ యాగాదులలో ఉపయుక్త ‘‘శ్రౌతాగ్నిని మధించుటకై , జమ్మికొమ్మ అవసరమైంది. అరణులలో అడుగు కర్ర జమ్మికర్ర. పై కర్ర రావికర్ర వాడతారు. జమ్మిని స్ర్తిలింగంగా, రావిని పుంలింగంగా (శమింతా, అశ్వత్థ:) ఆర్యులు పేర్కొన్నారు. అగ్ని శమీ గర్భాన కలదని (శమీగర్భాదగ్నింమన్థతి) అని శ్రుతి వచనం. కనుకనే శమీ పూజకు ప్రాధాన్యత ఏర్పడింది. విజయ దశమి నాడు శమీవృక్షాన్ని పూజించే క్రమంలో రామార్జున గాధలను స్మరించే సంప్రదాయం ఉంది. రాముడు, రావణునిపై విజయం సాధించిన దినంగా, పాండవులు వనవాసం వెళుతూ, శమీవృక్షం పైనుండి తమ ఆయుధాలను తిరిగి పొంది కౌరవులను జయించిన దినంగా విజయ దశమికి ప్రత్యేకత ఉంది. అర్జునునితో కూడిన పాండవులు అజ్ఞాత వాసం వెళ్ళే సమయాన తమ అస్తశ్రస్త్రాలను శమీవృక్షంపై నిక్షేపించినట్లు భారత కథనం. శమీవృక్షం లేదా జమ్మిచెట్టు మాగ్నోలియోపైటా తరగతికి, ప్రోసోపిస్ జాతికి, ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్ర్తియ నామం ప్రొసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో ‘‘అరణి’’ అని పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువు అని ‘‘అరణి’’ అర్థం. జమ్మి ఆకుల పసరు తీసి, పుళ్ళకు రాస్తే కుష్టువ్యాధి నశిస్తుందని, జమ్మిపూలను చక్కెరతో కలిపి సేవించడం వల్ల గర్భస్రావం కాకుండా నిరోధించ బడుతుందని, జమ్మిచెట్టు బెరడు దగ్గు ఆస్తమా వ్యాధులకు ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. విజయ దశమి సాయంత్రం శమీవృక్షం వద్ద అపరాజితను పూజించి, ‘‘శమీ శమయతే పాపం శమీ లోహిత కంటకా, ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ, కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖం మయా, తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామ పూజితే’’ అని చిట్టీలపై రాసి, జమ్మి చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. దీని వల్ల అమ్మవారి కృపతోపాటు శని దోష నివారణ కాగలదని విశ్వాసం. మహారాష్ట్రులు శమీవృక్షానికి తోడు పలాశ (మోదుగ) పత్ర పూజా చేస్తారు. హిందువుల శుభాశుభ కర్మల్లో మోదుగ ప్రమేయం అధికం. ఉపనయనాల్లో వటువులు భిక్షా సమయాన ధరించేని పలాశ దండం. కాశీకి వెళ్ళి వచ్చిన నైష్ఠీకులు మోదుగ ఆకుల విస్తళ్ళలోనే భోజనం చేసే వారు. పలాశపత్రాలను పోలిన బంగారు చిన్నచిన్న ఆకులను చేయించి, దేవుళ్ళకు, స్నేహితులకు, బంధువులకు ఇవ్వడం విజయ దశమినాటి మహారాష్ట్రుల ఆచారం.

- సంగనభట్ల రామకిష్టయ్య