Others

హిందువులు చేస్తే తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ ధర్మం నుండి అన్యమతాలలోకి మారిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం గురించి ‘ప్రబుద్ధ భారతి’ పత్రిక ప్రతినిధి 1899 ఏప్రిల్‌లో స్వామీ వివేకానందతో చేసిన సంభాషణ ఇలా ఉంది (ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, సంపుటి-5, పుటలు: 233- 234):
ప్రతినిధి: ‘‘హిందూ మతానికి దూరమైన వాళ్ల గురించి చెప్పండి స్వామీ! వారిని వెనక్కి తీసుకోవాలని మీ అభిప్రాయమా?’’ అని అడిగాడు స్వామి వివేకానందను 1899, ఏప్రిల్‌లో ‘‘ప్రబుద్ధ భారత’’ పత్రిక ప్రతినిధి.
వివేకానంద: ‘‘కచ్చితంగా! వారిని వెనక్కి తీసుకోవచ్చు. తీసుకుని రావాలి కూడా’’ అని కాసేపు ఆలోచించి ‘లేకపోతే మన సంఖ్య తగ్గిపోతుంది. మహమ్మదీయ చరిత్రకారులందరిలోకీ పాతవాడైన ఫెరిస్టా చెప్పినదాని ప్రకారం మహమ్మదీయులు వచ్చేనాటికి దేశంలో అరవై కోట్ల హిందువులుండేవారు. ఇప్పుడు మనం సుమారు ఇరవై కోట్ల మందిమి. హిందూ సమాజం నుంచి ఒకడు బయటికి వెళుతున్నాడంటే మనకు ఒకడు తగ్గడమేకాదు. ఒక శత్రువు పెరుగుతున్నాడు’’
‘‘పైగా ఇస్లాంలోకో, క్రైస్తవంలోకో వెళ్లినవారు కత్తి భయానికి చేరినవారు. వారి వంశీకులే ఇప్పటివాళ్లు. వారిని తక్కువగా చూడటం అన్యాయం’’ అన్నాడు స్వామి.
ప్రతినిధి: ‘‘మరి పుట్టుక నుంచీ విజాతీయులైనవారి సంగతో?’’
వివేకానంద: ‘‘ఒకప్పుడు వారూ హిందువులే. గుంపులుగా మతం మార్చబడ్డవాళ్లే. అదే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది’’ ప్రాయశ్చిత్తాల గురించి వారి సంభాషణ ఇలా సాగింది:
వివేకానంద: ‘‘ఇష్టపడి వేరే మతంలోకి వెళ్లినవారు స్వధర్మానికి తిరిగి వస్తామంటే ప్రాయశ్చిత్త కర్మకాండ చేయడం అవసరమే.. కానీ కాశ్మీర్, నేపాల్‌లో రాజ్యం మొత్తం అన్యమతస్థుల కైవసం కావడం మూలంగా మనకు దూరమైనవారికి ప్రాయశ్చిత్తం విధించకూడదు. అలాగే జన్మతః విదేశీయులై ఇష్టపడి మనలో చేరగోరేవారికి కూడా ప్రాయశ్చిత్తంతో పనిలేదు’’
ప్రతినిధి: ‘‘మతంలోకి తిరిగి వచ్చేవారు ఏ కులానికి చెందుతారు స్వామీ? వారికంటూ ఒక కులం ఉండాలి. లేకపోతే హైందవ బృహత్ వ్యవస్థలో వారెప్పటికీ కలిసిపోలేరు కదా?’’
వివేకానంద: ‘‘మన నుంచి వెళ్లిపోవడానికి ముందు వారిది ఏ కులమో, కులాన్ని తిరిగి వచ్చాక వారు పొందుతారు. కొత్తగా చేరే వారికంటూ వేరే ఒక కులం ఉండాలి. వైష్ణవ మతంలో ఈ పని ఇప్పటికే జరిగింది. వివిధ కులాలనుంచి, వేరే జాతులనుంచి వైష్ణవంలో చేరినవారు ఆ పతాకం కింద కూడి, తామే ఒక కొత్త కులంగా ఏర్పడ్డారు. అది ఎంతో గౌరవపాత్రమైంది కూడా. రామానుజుల నుంచి వంగ దేశంలో చైతన్య వరకూ గొప్ప వైష్ణవాచార్యులందరూ అలాగే చేశారు’’
ప్రతినిధి: ‘‘మరి పేర్ల సంగతేమిటి? విజాతీయులకు, అన్యమతాలలోకి వెళ్లిన వాళ్లకు హిందూ మతంలోకి వచ్చాక కొత్త పేర్లు పెట్టాలి కదా? కుల సంబంధమైన పేర్లు వారు పెట్టుకోవచ్చా?’’
వివేకానంద: ‘‘తప్పకుండా. పేరులోనే చాలా ఉంది’’
శతాబ్దాలుగా మన దేశంపై జరిగిన విదేశీ దండయాత్రలను రెండు రకాలుగా విభజించవచ్చు. గ్రీకులు, శకులు, హూణులు, యవనులు జరిపిన దండయాత్రలు. వీరిని మనం సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించాం. మిగిలినవారిని మనలో కలిపేసుకోగలిగాం. కానీ అరబ్బులు, మొఘలాయిలు, పోర్చుగీసువారు, డచ్ దేశస్థులు, బ్రిటిష్‌వారు జరిపిన దాడులు అంతకుముందు జరిగిన దాడులకన్నా భిన్నమైనవి. వారు తమతోపాటు తమ మతాలను వెంటబెట్టుకు వచ్చేరు. మన దేశంలో సాంస్కృతిక విధ్వంసం సృష్టించారు.
విదేశీ దురాక్రమణదారులను పరాక్రమంతో ఎదిరించడం, స్వధర్మరక్షణలో బలిదానాలు చేయడం మాత్రమే కాదు వారిని తనలో కలుపుకోవడంలో కూడా హిందూ సమాజం ఎప్పుడూ సిద్ధంగానే ఉండేది.
భారతదేశంపైకి దండెత్తి వచ్చిన అలెగ్జాండర్ సేనాధిపతి సెల్యూకస్‌ని ఓడించిన వౌర్య చంద్రగుప్తుడు అతడి కూతురిని వివాహం చేసుకుంటాడు. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో ఉత్తర భారతాన్ని ఆక్రమించుకున్న శకులను శాతవాహన మహారాజు తల్లి ఆదేశంతో ఆ శకరాజు కూతురు జయశీలను వివాహం చేసుకుంటాడు.
వేల సంవత్సరాల చరిత్రలో ఎందరో విదేశీయులు తనపైకి దండెత్తివచ్చి, ఎనె్నన్ని మతాలను, విశ్వాసాలను తనపై రుద్దాలని ఎంతగా చెలరేగినా, కాలక్రమంలో ఆయా విజాతీయులను, వారి తెగలను, మత విశ్వాసాలను తన నిరంతర జీవనస్రవంతిలో భారతదేశం కలిపేసుకోగలిగింది. యవనులు, హూణుల వంటి తొలితరాల ముష్కరులు మాత్రమేకాదు; మహమ్మదీయుల తొలి దండయాత్రలను కూడా ఆర్యావర్తం తట్టుకుని నిలబడింది. తన మతం మార్చజూసిన ముసల్మాన్లనే నెమ్మదిగా తన మతంలో కలిపేసుకుంది.
క్రీ.శ. 712లో పర్షియా పాలకుడి తరఫున మహమ్మద్‌బిన్ కాశిం హిందూ రాజ్యమైన సింధ్‌పైకి దండెత్తాడు. రాజధాని దేవళ్ నగరంలోని పురుషులందరినీ నిశే్శషంగా నరికేశాడు. మహిళలను చెరబట్టి బానిసలుగా మార్చాడు. అలోర్, నిరుణ్, ముల్తాన్, కిరాజ్ నగరాలమీదా విరుచుకుపడి దేవాలయాలను, బౌద్ధారామాలను నాశనంచేసి, ఎదిరించిన వారినల్లా ఊచకోత కోసి, స్ర్తి బాల వృద్ధులను వేల సంఖ్యలో బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించాడు. దేవాలయాలను పడగొట్టి వాటి శిథిలాలమీద మసీదులను కట్టించి, ఎక్కడికక్కడ ముస్లిం గవర్నర్లను నియమించి ముప్పూటలా నమాజ్ ఘోషతో దిక్కులు మారుమోగుతుండగా మూడేళ్లతరవాత స్వదేశానికి తిరిగి వెళ్లాడు.
కాశీం తిరిగి వెళ్ళిన తరువాత సింథ్‌తో అరబ్ ప్రాభవం క్షీణించడమేగాక కొత్తగా మతం మారిన వారిలో అత్యధిక సంఖ్యాకులు తమ పూర్వ ధర్మంలోకి తిరిగివెళ్లారు. కస్సాలో మినహా భారత ప్రజలు విగ్రహారాధనకు మరలిపోయారు. ఇది స్వయానా చూసిన అల్‌బైలాదురి అనే చరిత్రకారుడు ‘‘ముసల్మాన్లకు భద్రతకరవైంది’’అని చెప్పాడు. ‘ఇస్లాం’ గ్రంథకర్తఅయిన సర్ డెన్‌సియన్ రాస్, ‘‘ఆ తరువాత సింధు నది పడమటి తీరంలోని ముస్లింలుకూడా హిందూధర్మంలో చేరిపోయారు. సింధ్‌లో ముస్లిం రాజధాని అయిన మన్సురాలో వారు హిందూధర్మాన్ని స్వీకరించారు’’ అని వ్రాసాడు. మహమ్మద్ బిన్ కాశిం దండయాత్ర తరవాత పనె్నండేళ్ళకు హషీం ఖలీఫా అయ్యేనాటికి సింధ్‌లో మతం మారినవారు దాదాపుగా అందరూ హిందూధర్మంలోకి తిరిగి వెళ్లారు. సింధ్ ప్రాంతంలో ఎన్నో వేలమందిని మెడమీద కత్తిపెట్టి, బలవంతంగా మహమ్మదీయ మతంలోకి మార్పించినా, క్రమేణా వారందరూ హైందవ ధర్మంలోకి తిరిగి రాగలిగారు. దీనినిబట్టి దౌర్జన్యంగా మత మార్పిడి జరిగిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకోగలిగిన ఔదార్యం, విశాల దృక్పథం నాటి హిందూ సమాజంలో ఉందని తెలుస్తుంది.
అన్యమతాలలోకి మార్చబడిన వారిని హిందూ ధర్మంలోకి తిరిగి తీసుకున్న సంఘటనలు చరిత్రలో మనం చూడవచ్చు.
పదవ శతాబ్దంలో దేవల స్మృతి ప్రాచుర్యంలోకి వచ్చింది. బలవంతంగా ముస్లింలుగా మార్చబడిన హిందువులను తిరిగి హిందువులుగా మార్చడానికి మార్గనిర్దేశనం చేసింది. హిందూ స్ర్తిలు మ్లేచ్ఛులచేత చెరచబడినా, వారివల్ల గర్భధారణ అయినా తిరిగి వారిని హిందూధర్మంలోకి స్వీకరించవచ్చని దేవలస్మృతి పేర్కొంది. అదే విధంగా 12వ శతాబ్దంలో జీవించిన విజ్ఞానేశ్వరుడుయాజ్ఞవల్క స్మృతిపై భాష్యంవ్రాస్తూ అనేక స్మృతులలోని శ్లోకాలను పేర్కొంటూ హిందూ స్ర్తి మ్లేచ్చుల చేత చెరచబడినా ఆమెను శుద్ధిచేసిన తరువాత ఆమె ఏ కులానికి చెందినదో అదే కులంలోకి స్వీకరించాలని ఆదేశించాడు. ఆ స్మృతినే ఆనాడు ఉత్తర, దక్షిణ భారతాలలో అనుసరించినట్లు తెలుస్తోంది.
క్రీ.శ.1398-99లలో విజయనగర రాజు దేవరాయలు పొరుగు రాజైన ఫిరోజ్‌షాపై దండయాత్ర చేసాడు. అదే సమయంలో ఫిరోజ్‌షా రెండువందల మంది బ్రాహ్మణ యువతులను తన సైన్యంతో చేరబడతాడు. బ్రాహ్మణుల విజ్ఞప్తిమేరకు దేవరాయలు ఫిరోజ్‌షాతో సంధిచేసుకుని హిందూ యువతులను విడిపిస్తాడు. ముస్లిం సైనికులచే అపవిత్రం కాబడిన ఆ స్ర్తిలను శుద్ధిచేసి తిరిగి హిందూ సమాజం స్వీకరించినట్లు ‘తాహరిక్ ఫెరిస్తా’ పేర్కొంది.
హిందూ సమాజం నుండి బయటకు వెళ్ళిన వారిని వెనక్కి తెచ్చుకునే హక్కు హిందువులకు ఉంది. అనేక శతాబ్దాలుగా దేశంలో తమ సంఖ్యను మతమార్పిడుల ద్వారానే ముస్లింలు, క్రైస్తవులు పెంచుకుంటూ వచ్చినప్పుడు అదే పనిని హిందువులు చేస్తే ఎందుకు తప్పు పట్టాలి?
అయితే ఈ ఘర్ వాపసీ లేదా పునరాగమనం లేదా శుద్ధికార్యక్రమం హిందువుల సంఖ్యను పెంచుకునే మార్గంగా కాకుండా ఒక సామాజిక సంస్కరణ సాధనంగా సాగాలి. ఆర్యసమాజ స్థాపకులైన దయానంద సరస్వతి పునరాగమనం అనేది హిందూ సమాజం తనని తాను సంస్కరించుకోవడం వంటిదనీ, మన సమాజంలోని లోపాల వల్లనే మన సోదరులు కొందరు మనకి దూరమయ్యే పరిస్థితి దాపురించిందనీ అన్నారు.

- ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్, 8008264690