Others

ఆచి తూచి అడుగులు.. అందరికీ అంతంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం మూలంగా నూతనంగా బడ్జెట్ సమర్పణలో కేంద్ర ఆర్థిక మంత్రి ఆచితూచి అడుగులేశారు. కొత్త పథకాల జోలికెళ్లి వ్యయాన్ని పెంచడం, రుణభారాన్ని మరింత నెత్తుకోకుండా జాగ్రత్తపడ్డారు. ఆదాయానికి, వ్యయానికి మధ్య పొంతన కుదరడం లేదన్నది వాస్తవమే. ఈ దఫా బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు భారీగా కేటాయింపులు జరపడం నిజంగా శుభ సూచకమే. ఏతావతా నిర్మలత్వాన్ని చాటుకుంటూ సీతారామన్ ఇరకాట పరిస్థితినుంచి గట్టెక్కారు. ప్రజల ఆదాయాన్ని, కొనుగోలు శక్తిని పెంచడమే ధ్యేయంగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. పొదుపుకన్నా ఖర్చుచేయండంటూ మీ వ్యయమే ఆర్థిక మాంద్యానికి మందంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. బడ్జెట్ లాభమా, నష్టమా అనేది సమాజంలోని సకలవర్గాలూ వ్యక్తిగతంగా ఫలితాలు అనుభవ పూర్వకంలోగానీ తెలిసిరావేమో!!
బడ్జెట్... ఆర్థికగమనాన్ని నిర్దేశించే కొలమానిగా భావించే ప్రక్రియ. ప్రతి ఏటా అందరికీ వినిపించే ఆర్థిక పలుకులపై అందరికీ ఆసక్తే... ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ సమర్పణలో ఎన్నో కొత్తకొత్త అంశాల ఆవిష్కరణ, పథగమనాన్ని నిర్దేశించాయి. ‘నిర్మల’ హృదయ సీతారామన్ ఈ బడ్జెట్ సమర్పణలో ఎంతో కసరత్తుచేశారు. సుదీర్ఘ సమయంలో సరికొత్త ఆలోచనలను బయటపెట్టారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా వెలుగొందుతున్న దశలో దేశానికి ఉపయుక్తమైన సాగు-సాయం పైనే బడ్జెట్ రచన సాగిందని చెప్పక తప్పదు. మేరా కర్షక్ మహాన్, హమారా ప్రధాన్ రైతు ఆద్మీ తరహాలో, రైతేరాజన్న సందేశాన్నిచ్చారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వ్యవసాయాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీటవేశారు. రైతులకోసం 16 సూత్రాల కార్యాచరణ ప్రణాళికలను వల్లెవేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మనస్సుపెట్టారు. వ్యవసాయం, నీటిపారుదల, సాగు అనుబంధ రంగాలపైనే రూ.1.60 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌కు మరో రూ.1.23 లక్షల కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల పెరుగుతున్న సోలార్ వినియోగాన్ని గుర్తించి ఆ రంగంలో విద్యుదుత్పత్తిని పెంచేందుకు ప్రోత్సహించాలని సంకల్పించింది. చాలా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోని రైతులు తమ బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు పెట్టేందుకు సాయపడాలని నిర్ణయించడం గొప్ప ఆలోచనగా అభివర్ణిస్తున్నారు. ఇదే సమయంలో 100 కరువుపీడిత జిల్లాల్లో సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేయడం ముదావహం. అలాగే రైతుల్ని పట్టిపీడిస్తున్న వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 15 లక్షల కోట్లకు పెంచారు. ఇటీవల కాలంలో ధరల దండయాత్ర మనకు ఎరుకే. ఇబ్బడిముబ్బడిగా నిత్యావసర ధరలు సెగ పెడుతున్న ఈ వేళ ఆహార ధరల అదుపునకు స్థిరీకరణ నిధి ఆలోచనలతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఉల్లి, టమోటా లాంటి ఆహార ధరలను అదుపులో ఉంచడానికే ఈ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఇప్పటికే దిగుమతి సుంకం, కనీస మద్దతు ధర, ఎగుమతి పరిమితులు, నిల్వలపై పరిమితులు తీసుకురావడంతోపాటు రాష్ట్రాలు కూడా బ్లాక్‌మార్కెట్‌ను కట్టడి చేయాలని సూచించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలాఉంటే రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలేవి బడ్జెట్‌లో ఇతమిత్థంగా ప్రతిపాదించలేదనే విమర్శలు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) చేసే రైతులను ప్రోత్సహించడంతోపాటు పైసా ఖర్చులేకుండా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని కనిష్టస్థాయికి 5 శాతానికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అందులో వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధిరేటు కేవలం 2.8 శాతానికి పరిమితమైనప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే కౌలుదారులకు లాభం చేకూరలేదు. కౌలుదారులను లెక్కించేందుకు దేశంలో ఇంతవరకు నిర్దిష్టంగా ఏ కసరత్తు జరగలేదు. 2018లోనూ, ఆ తర్వాత సరైన మద్ధతు ధరలు లభించక దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. గత ఏడాది చివర్లో ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై నగరాల్లో రైతులు భారీ ప్రదర్శనలకు దిగారు. అంతేకాక ఏడాదికేడాది రైతుల ఆత్మహత్యలు, పోరాటాలు, ఉద్యమాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. రైతులకు సంబంధించిన ఏ హామీనైనా చిత్తశుద్ధితో అమలుచేయాలన్నా కేంద్రం, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం, సహకారం ఉండాల్సి ఉంది. ఏదైనా పథకం ప్రవేశపెట్టే దశలోనే రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ముందుగా రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర పెంపుపైనే కేంద్రం దృష్టి నిలపాలన్నది అందరిమాట. వీటన్నిటితోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మొదట వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలని నిపుణులు వక్కాణిస్తున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా సర్వత్రా యువత పైనే అందరి దృష్టి నిలుస్తుంది. నానాటికీ పెరిగిపోతున్న విద్యా ఉత్తీర్ణులకు మేలుచేకూర్చే అంశాలపై బడ్జెట్‌లో ప్రాధాన్యతనివ్వడం పేర్కొనదగినదే. దేశంలో విద్యావ్యవస్థను సంస్కరించే దిశగా త్వరలోనే నూతన విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్‌లో వెల్లడించారు. ఉన్నతవిద్య అభ్యసించే వారికోసం పూర్తిస్థాయి ఆన్‌లైన్ కోర్సును అందుబాటులోకి తేవాలనుకోవడం హర్షించదగినదే. విద్యారంగానికి 99,300 కోట్లు వృత్తి విద్యాశిక్షణ నైపుణ్యాలకు 3,000 కోట్లు ఇవ్వడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఆకర్షించేలా చర్యలను ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. అయితే నడుస్తున్న చరిత్రలో ఉపాధి, నైపుణ్యాల మెరుగుకు ఎల్లెడలా ప్రాధాన్యం ఉంటున్న తరుణంలో తక్కువ మొత్తాన్ని కేటాయించడం గమనార్హం.
విశ్వవ్యాప్తంగా భారత్‌లోనూ ఆరోగ్యం ప్రాథమిక అవసరంగా పేర్కొనబడుతోంది. ఆయా దేశాలు జీడీపీలో ఆరోగ్య రంగంపై వెచ్చిస్తున్న శాతాలను పరిశీలిస్తే భారత్‌లోనే అతి తక్కువగా 1.28 శాతంగా ఉంది. అదే అమెరిలో 17.15 శాతం ఉంది. బ్రిటన్, చైనా, పాకిస్థాన్‌కన్నా మన దగ్గరే తక్కువగా ఉంటోంది. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తూ 69వేల కోట్లు కేటాయింపూ ప్రత్యేకించదగినదే. 2020-19 బడ్జెట్‌కన్నా అదనంగా 10 శాతం పెంచుతూ నయంచేసే వ్యాధుల సంఖ్యను కూడా 12కు పెంచుతూ, కొత్తగా 5 వ్యాధులకు చోటు కల్పించారు. పన్నులు ఇబ్బడిముబ్బడిగా వసూలైతేనే ఏ పని చేపట్టినా పురోగమించేందుకు అవకాశమేర్పడుతుంది.
2019-20లో పన్నుల రాబడి 22.4 లక్షల కోట్లయితే, అంతకు పూర్వం 2018-19లో పన్నుల ఆదాయం 24.6 లక్షల కోట్లుగా 15వ ఆర్థిక సంఘమే సెలవిచ్చింది. దీన్నిబట్టి 2.2 లక్షల కోట్లు ఆదాయం తగ్గినట్లే. పన్నుల వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం అత్యంత ఆవశ్యకమైనది. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు కొన్ని రాష్ట్రాలకు నష్టమే కలిగించాయి. పన్నుల వాటాలో రాష్ట్రాలకు రావాల్సిన దాంట్లో కోత విధించడం అందరూ గమనించాల్సిన అంశమే. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం, 1971 జనాభా లెక్కల్లోని సంతానోత్పత్తి రేటును కలపడం లాంటి గందరగోళాల మధ్య ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరిగింది. రాష్ట్రాలకు పన్నులు వాటా... కేంద్రం భరించాల్సిన దానిలో 42 శాతం బదులు 41 శాతం అయింది. దరిమిలా రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గి, ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఏ రాష్టమ్రైనా ప్రస్తుత ఖర్చును ప్రస్తుత ఆదాయంనుంచే చేయాల్సి ఉంది. అప్పుడే రెవెన్యూ లోటు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలు దీనికి దూరమవ్వడంతో ఆ రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఆర్థిక సంఘం నిధులిస్తోంది. ఈ జాబితా 14 రాష్ట్రాలకు పెరిగింది. 2020-2021లో రాష్ట్రాలకు బదిలీచేసే పన్నుల వాటాను ఆర్థిక సంఘం 8,55,178 కోట్లుగా పేర్కొంటుండగా, బడ్జెట్‌లో మాత్రం 7,84,180 కోట్లుగా ప్రతిపాదించారు. స్థూలంగా 2020-21లో 70,996 కోట్లు తక్కువగా రాష్ట్రాలకు పన్నుల వాటా దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కర్ణాటక, కేరళ, అసోం లాంటి రాష్ట్రాలకే ఈ నష్టం కలుగుతుందని ఆర్థిక నిపుణులు నొక్కిచెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని, ఆర్థిక ఒడిదుడుకులు మధ్య సతమతవౌతున్న ఆంధ్రప్రదేశ్‌పైనే కేంద్ర పన్నుల వాటా తగ్గింపు ప్రభావం ప్రతికూలతను చోటుచేస్తుందని విశే్లషకులు అంచనావేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, మాంద్యం పూర్వరంగంలో బడ్జెట్ గణాంకాలను స్థూలంగా పరిశీలిస్తే.. స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల 12 శాతంగా ఉంటుందని అంచనావేస్తే 20-19లో జీడీపీ పెరుగుదల 8.5 శాతమే రికార్డయింది. 20-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ పెరుగుదల అంచనా 10 శాతంగా ఉంది. ద్రవ్యలోటు అంచనా 3.3 శాతం కాగా 2020-21లో ద్రవ్యలోటును 3.5 శాతంగా ఉంచాలని ప్రతిపాదించారు. నికర పన్ను, రాబడి వసూళ్లు 16,49,582 కోట్లుగా అంచనావేస్తే 2020 మార్చి నెలాఖరుకు కేవలం 15,04,587 కోట్లే వసూలు చేయగలుగుతుందని ఆర్థిక నిపుణులంటున్నారు.

- చెన్నుపాటి రామారావు 9959021483