క్రీడాభూమి

హెచ్‌డబ్ల్యుఎల్ ఫైనల్స్ .. టైటిల్ రేస్ నుంచి భారత్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, డిసెంబర్ 5: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (హెచ్‌డబ్ల్యుఎల్) టోర్నమెంట్ టైటిల్ రేస్ నుంచి భారత్ నిష్క్రమించింది. శనివారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఈ జట్టు 0-1 తేడాతో బెల్జియం చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయిన సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్ ఇక క్లాసిఫికేషన్ మ్యాచ్‌ల్లో పోటీపడుతుంది. రెండో సెమీ ఫైనల్ ఆరంభమైన ఐదో నిమిషంలోనే బెల్జియం ఆటగాడు సెడ్రిక్ చార్లియర్ గోల్ చేశాడు. ఆతర్వాత బెల్జియం రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ఈక్వెలైజర్ కోసం దూకుడును పెంచాల్సిన భారత ఆటగాళ్లు అందుకు భిన్నంగా ఆడారు. ఏ దశలోనూ బెల్జియం రక్షణ విభాగానికి సవాళ్లు విసరలేకపోయారు. నిలకడలేని ఆటతో అల్లాడుతున్న సర్దార్ సింగ్ సేన మరోసారి అదే సమస్య కారణంగా ఓటమిపాలైంది.