అంతర్జాతీయం

59 మంది జాలర్లను అరెస్టు చేసిన పాక్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: తమ సముద్ర జలాల్లోకి చొచ్చుకునివచ్చి చేపలను వేటాడుతున్న భారత్‌కు చెందిన 59 మంది జాలర్లను శుక్రవారం పాక్ అధికారులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. గుజరాత్, సింధ్ సరిహద్దుల్లో భారతీయ జాలర్లు వేటకు వెళ్లగా పాకిస్తాన్ సముద్ర జలాల రక్షణ సంస్థ అధికారులు అరెస్టు చేసి పది పడవలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద సర్‌క్రీక్ ప్రాంతంలో వేటకు వెళ్లే భారతీయ జాలర్లను పాక్ తరచూ అరెస్టు చేస్తోంది.