జాతీయ వార్తలు

సోనియా, రాహుల్‌గాంధీలకు బెయిల్‌ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ ‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు పాటియాల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణలో భాగంగా శనివారం వారు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. సోనియా, రాహుల్‌ తరపున కపిల్‌ సిబల్‌ కేసును వాదించారు. బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా న్యాయమూర్తిని కోరగా, చెరో రూ.50వేల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. మరోపక్క సోనియా, రాహుల్‌గాంధీలకు బెయిల్‌ ఇవ్వడాన్ని భాజపా నేత సుబ్రమణ్యస్వామి వ్యతిరేకించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మొత్తం ఏడుగురికి పటియాలా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.