జాతీయ వార్తలు
వ్యహానికి పదునుపెట్టిన పవార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 May 2019
న్యూఢిల్లీ: ఏన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ ఫలితాల్లో వెల్లడవ్వటంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన రాజకీయ వ్యహానికి పదును పెట్టారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్ష నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలో పలువురు నాయకులు ఇతర నాయకులతో వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా యూపీఏలోని సీనియర్ నాయకుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మూడు పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఇరు కూటములకు దగ్గరకాని తెలంగాణ రాష్ట్ర సమితి, వైకాపా, ఒడిశాలో బిజు జనతా దళ్ నాయకులతో చర్చలకు ప్రయత్నించినట్లు సమాచారం.