రాష్ట్రీయం

హరి ప్రసాద్ చౌరాసియాకు డాక్టర్ పిన్నమనేని పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: డాక్టర్ పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ రజతోత్సవ పురస్కారాలకు ప్రముఖ వేణునాద విద్వాంసులు పద్మభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, యువ రచయిత హిన్‌దోల్ సేన్ గుప్తాలను ఎంపికయ్యారు. వీరికి ఈనెల 16న సిద్ధార్థ ఆడిటోరియంలో అమెరికా డెట్రాయిట్‌లో నివసించే ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పిఆర్‌కె ప్రసాద్ అధ్యక్షతన జరిగే సభలో పై ఇరువురికి పురస్కారాలు అందజేయనున్నామని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ సుధా తెలిపారు. ఈ పురస్కారాల కింద 5లక్షల చొప్పున నగదు అందజేయనున్నారు. ఇదే సందర్భంగా సమగ్ర దానిమ్మ వ్యవసాయ ప్రముఖులు ముట్లూరి నరసింహప్ప గ్రామీణ ప్రగతి పురస్కారాన్ని అందజేయనున్నారు.