తెలంగాణ
శ్రీయ రీ-పోస్టుమార్టం వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 March 2016
హైదరాబాద్: అనుమానాస్పదంగా మరణించిన ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీయ మృతదేహానికి రీ-పోస్టుమార్టం వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని శుక్రవారం బయటికి తీశారు. అయితే, మరోసారి పోస్టుమార్టం జరపాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు శ్రీయ తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. 20 రోజుల క్రితం విశాఖలోని గీతం యూనివర్సిటీలో శ్రీయ మరణించింది. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్యచేశారని శ్రీయ తల్లిదండ్రులు ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.