ప్రకాశం

ప్రత్యేక హోదా కల్పించడంలో రాష్ట్రానికి తీరని అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, డిసెంబర్ 12 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో తీరని అన్యాయం జరిగిందని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తీవ్రంగా విమర్శించారు.మంగళవారం పొదిలి పట్టణంలో వివేకానంద డిగ్రీ కాలేజీలో వైకాపా ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జంకె మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్భ్రావృద్ది అన్నీ విధాలుగా సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్భ్రావృద్దిని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీల వలన రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలేమీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమించాలని జంకే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె నరసింహారావు, జడ్పిటిసీ సాయి రాజేశ్వర్ , వైకాపా నాయకులు కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, వాకా వెంకటరెడ్డి, వెలుగోలు కాశి తదితరులు పాల్గొన్నారు.