ప్రకాశం

ఈ వీధి నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులరు, ఫిబ్రవరి 20: గ్రామీణ ప్రాంతాల్లో బలవంతులు ప్రభుత్వభూములు, బలహీనుల ఆస్తులు ఆక్రమించుకుని అవి తమవేనని బుకాయించడం సర్వసాధారణమే. కాని తంగేడుమల్లి గ్రామంలో ఒక ప్రబుద్ధుడు ఏకంగా ఆ వీధే నాదంటూ రోడ్డుకు కంప అడ్డువేసి వీధిని మూసివేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తంగేడుమల్లి దళితవాడలో ఇటీవల ప్రభుత్వ నిధులు రూ.20 లక్షలు ఖర్చుచేసి సిమెంటు రోడ్లు వేశారు. కాలనీలో నుండి సంతమాగులూరు - ఈటీ రోడ్డుకు సిమెంటు రోడ్డును అనుసంధానం చేసేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో సిమెంటు రోడ్డు వేశారు. రోడ్డు వేసేంతవరకు కిమ్మనకుండా ఉన్న తరిమెళ్ల జ్యోతి అనే అతను రోడ్డుపనులు పూర్తికాగానే ఈ రోడ్డువేసిన స్థలం నాదేనని నా స్థలంలో గుండా ఎవ్వరినీ నడవనీయనని అలా నడవాలంటే నెలవారి అద్దె చెల్లించాలని భీష్మించి ఏకంగా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి రోడ్డు రాకపోకలను నిలిపివేశాడు. కాగా ఈ విచిత్రమైన పరిస్థితిని గ్రామస్థులు అధికారులకు తెలిపినా ఏమాత్రం చర్యలు తీసుకోలేదని అధికారులు తక్షణమే రోడ్డుపై ముళ్లకంపలు తొలగించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.