ప్రకాశం

సజావుగా సాగిన ముఖ్యమంత్రి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, మే 17: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన గురువారం ప్రశాంతంగా, సజావుగా ముగిసింది. ముఖ్యమంత్రి పర్యటనను ఎమ్మెల్యే పోతుల రామారావు, రాష్ట్ర అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం తోపాటుగా జిల్లాలోని మంత్రులు, జిల్లా కలెక్టర్ , ఇతర అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం పర్యటనను విజయవంతం చేశారు. ఉదయం 12.05 నిమిషాలకు పోకూరు చెరువు వద్దకు ముఖ్యమంత్రి చేరుకోగానే ఎమ్మెల్యే పోతుల రామారావుతోపాటుగా మంత్రులు, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోకూరు చెరువులో నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ముఖ్యమంత్రి జెసిబి యంత్రంతో పోకూరు చెరువు పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయసానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఇందులో భాగంగానే నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాలు ద్వారా చెరువులో పూడికతీత పనులను పెద్దఎత్తున చేపట్టామన్నారు. పోకూరు చెరువు 1000 ఎకరాల్లో ఉందని 1200 ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు ఇది వరుకే రూ.45కోట్లు నిధులు మంజూరు చేసామని, ప్రాజెక్టు నుంచి పోకూరు చెరువుకు రూ.6.30కోట్లతో పైపులైను ఏర్పాటు చేస్తే నీరు వచ్చి రెండు పంటలు పండే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం నూకవరం ఎస్సీ కాలనీలో పర్యటించి విభిన్న ప్రతిభావంతుడు డి కోటయ్యను పరామర్శించి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకుని తక్షణమే రూ.25వేల పారితోషకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎస్సీ సబ్‌ప్లాన్, ఉపాధిహామీ నిధులతో కలిపి రూ.61.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల ఏర్పాటుకు, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా 41 గృహాల నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అలాగే బడేవారిపాలెంలో రూ.37.50 లక్షల వ్యయంతో అంతర్గత రోడ్లకు, రూ.70లక్షలతో ఎస్సీ సబ్‌ప్లాన్ అభివృద్ధి పనులకు శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అలాగే కాకుటూరు చెరువులో నీరు-ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బడేవారిపాలెంలో రచ్చబండలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ఇంటూరి నరసయ్య రాజధాని నిర్మాణానికి రూ.5లక్షలు విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేసారు. అనంతరం కందుకూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం సభ విజయవంతం అయింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రారంభమైన డైట్ సెట్ పరీక్షలు
యద్దనపూడి, మే 17 : డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డైట్ సెట్) పరీక్షలు గురువారం ప్రారంభమైనట్లు సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో ప్రారంభమైన పరీక్షలకు మొదటి రోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 1000 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 199 మంది గైర్హాజరు కావడంతో 801 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు లక్ష్మణరావు వెల్లడించారు. పరీక్షకు పరిశీలకులుగా వేటపాలెం, చినగంజాం మండల విద్యాశాఖ అధికారులు ఏకాంబరేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు వ్యవహరించారు.

సత్తాచాటిన ప్రకాశంజిల్లా కోడెలు
గిద్దలూరు, మే 17: మండలంలోని కెఎస్‌పల్లి సమీపంలోని భీమలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన నెమిలిగుండ్ల రంగనాయకస్వామి 8వ వార్షికోత్సవం సందర్భంగా రాష్టస్థ్రాయిలో నిర్వహించిన ఎడ్లు బండలాగుపోటీల్లో ప్రకాశంజిల్లా పొట్లపాడు గ్రామంకు చెందిన బయ్యపురెడ్డి ఎడ్లజత 4500 అడుగులులాగి ప్రథమ బహుమతి రూ.25వేలను కైవసం చేసుకోగా వైఎస్‌ఆర్ జిల్లా దాసరిపల్లికి చెందిన నరేష్ ఎడ్లజత 3857 అడుగులులాగి ద్వితీయ బహుమతి 15వేలు, వైఎస్‌ఆర్ జిల్లా కొత్తపల్లి గ్రామంకు చెందిన ఎం సుబ్బారెడ్డి ఎడ్లజత 3705 అడుగులులాగి తృతీయ బహుమతి 10వేలు, హజనాపురం గ్రామానికి చెందిన ఐవి సుబ్బారెడ్డి ఎడ్లజత 3693 అడుగులు లాగి చతుర్థ బహుమతి, గుండమ్మచెన్నారెడ్డి ఎడ్లజత 3635 అడుగులు లాగి పంచమ బహుమతి, కాటంవారిపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఎడ్లజత 3370 అడుగులు లాగి ఆరవ బహుమతి సాధించాయి. నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఐవిరెడ్డి నగదు బహుమతులను ప్రకటించగా బహుమతులను ఆయన తండ్రి ఇల్లూరి పెద్దపుల్లారెడ్డి చేతుల మీదుగా విజేతలకు అందచేశారు.