ప్రకాశం

సబ్సిడీ రుణాలను పెద్దఎత్తున పంపిణీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 24 : జిల్లాలో సంక్షేమ శాఖల ద్వారా ప్రజలకు అందించే సబ్సిడీ రుణాలను పెద్దఎత్తున పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం తన నివాసంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా అమలుచేస్తున్న పథకాలను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. దర్శి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అబివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి జగన్నాధరావు, బీసీ సంక్షేమ శాఖ ఈడి లక్ష్మీదుర్గ, మైనార్టీ కార్పొరేషన్ ఈడి సిరాజుల్లా, దర్శి ప్రత్యేక అధికారులు బి రవి తదితరులు పాల్గొన్నారు.