క్రైమ్/లీగల్

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంభం, నవంబర్ 10: రైలు కింద పడి మృతి చెందిన సంఘటన కంభం రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగింది. మృతుడు వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తు తెలియని మృతదేహం ఎంత ఆరాతీసినా ఎవరిది అనేది తెలియరాలేదు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్‌టిసి, బొలోరా వాహనం ఢీకొని ఒకరికి గాయాలు
కంభం, నవంబర్ 10: ఆర్‌టిసి, బొలోరా వాహనం ఢీకొని ఒకరికి గాయాలైన సంఘటన కంభంలోని లింగారెడ్డిపాలెం సమీపంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే కంభం నుండి మార్కాపురం వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సును మార్కాపురం నుండి కంభం నుండి వస్తున్న బొలోరా వాహనం ఢీకొనగా బస్సులో ఉన్న సూర్య అనే అతనికి గాయాలు కాగా మరో ఇద్దరు స్వల్ప గాయాలకు గురయ్యారు. జరిగిన సంఘటనపై కంభం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.