ప్రకాశం

రైతు సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ పాలకవర్గం పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, నవంబర్ 17 : మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతు సంక్షేమం కోసం పాటుపడి ప్రజల్లో గుర్తింపు పొందాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శనివారం స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో మార్కాపురం మార్కెట్ కమిటీ పాలకవర్గంతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి రాఘవరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని సామాజికవర్గాలకు న్యాయం జరగాలన్నదే ధ్యేయమని, మార్కాపురం పాలకవర్గ చైర్మన్‌గా బీసీ కులానికి చెందిన శ్రీనివాసయాదవ్ నియామకం హర్షణీయమని అన్నారు. ప్రభుత్వపరంగా రైతులకు వచ్చే అన్ని సౌకర్యాలు సకాలంలో అందించి వారి సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. వైస్ చైర్మన్‌గా జె రామాంజనేయరెడ్డి, సభ్యులుగా బివి రమణ, డి మస్తానయ్య, బి సుధీర్, పి అమిరుల్లాఖాన్, పేరూరి భాస్కర్, పి విజయలక్ష్మి, ఎం చిన్నవెంకటేశ్వర్లు, టి రామయ్య, తమ్మిశెట్టి వెంకటరత్నం, కె యోగిరెడ్డి, టి రామయ్య, చల్లా వెంకటేశ్వర్లు, పి వెంకటస్వామిలచేత మంత్రి శిద్దా రాఘవరావు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ కూనా రవికుమార్, టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం, ఎంఎల్‌సి కరణం బలరామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.