ప్రకాశం

ఘనంగా ముక్కోటి ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,డిసెంబర్ 18: మార్గశిరమాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాల్లో ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారదర్శనానికి తీసుకొచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివార్లను దర్శించుకోవటం ముక్తిదాయకమని వేదపండితులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒంగోలు నగరంలోని ఆలయాలు భక్తులతో బారులుతీరాయి. జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్నచెన్నకేశవస్వామి దేవాలయంలో గంగాపార్వతి సమేత కాశీ విశే్వశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన మాగుంటను శ్రీప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం చైర్మన్ కొల్లిపల్లి సురేష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్టాప్రసాదు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాగుంటకు స్వామివారి శేషవస్త్రాలను బహుకరించారు. ఒంగోలు నగరంలోని గడియారం వారి వీధిలో వేంచేసి ఉన్నశ్రీకోదండరామస్వామి దేవాలయంలో, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పశుపతీశ్వరస్వామి ఆలయంలో, కొత్తపట్నం బస్టాండు సెంటరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో, సంతపేట, లాయరుపేటలోని సాయిబాబా మందిరాల్లో, గద్దలకుంటలోని శ్రీశక్తిపీఠంలో, మంగమూరు రోడ్డు లోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో, బివిఎస్ హాలువద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఉత్సవ మూర్తులను ఉత్తర ద్వార దర్శనానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు దేవాలయాల్లోబారులు తీరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయనిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్బంగా ఉపవాస దీక్షలు చేసిన భక్తుల కోసం ప్రత్యేకంగా హరిహర నామ సంకీర్తనలు, భజనలు ఏర్పాటుచేశారు.