ప్రకాశం

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 18 : రానున్న 2019 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుయువత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరిముల్లా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రానున్న 2019 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుపొందే విధంగా తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత మూలస్తంభం అని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో తెలుగు యువతకు తగిన ప్రాధాన్యత కల్పిస్తారని హామీ ఇచ్చారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి చేస్తే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విమర్శలకు భయపడేది లేదని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళతామన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా మరలా రెపరెపలాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జిల్లా శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు పాటు పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు మళ్లీ సైనికుల్లా పనిచేసి జిల్లాలోని 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలన్నారు. ఆ దిశగా తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా మరింతగా కృషిచేయాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా జిల్లాలో మరింత అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీ గెలుపునకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో తెలుగు యువత అధ్యక్షులు కరిముల్లా పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించుకుని జిల్లాలో తిరిగి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరిముల్లా మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్‌బాబు ఆధ్వర్యంలో తెలుగు యువత చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. యువనేస్తం, చంద్రన్న బీమ, రైతు రుణమాఫీ, పెన్షన్లు, యువతకు ఉపాధి శిక్షణ, వృత్తివిద్య, ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవ వంటి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో తెలుగు యువత సమావేశాలు నిర్వహించి ఆయాన మండలాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాల రూపంలో ముద్రించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. వచ్చే నెల 20వ తేది నుండి ఇంటింటికి తెలుగు యువత అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి ఆంజనేయులు, ప్రచార కార్యదర్శి నల్లూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వీరేంద్రనాథ్‌చౌదరి, కె శివ శంకర్‌రావు, కార్యదర్శులు మీరావలి, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరావు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామేపల్లి శ్రీనిసరావు, నగర పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, నాయకులు బెజవాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.