ప్రకాశం

4వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 18: జిల్లాలో వచ్చేనెల నాల్గవతేదీ నాటికి ఓటర్ల తుదిజాబితాను పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో ఓటర్ల తుదిజాబితా ప్రచురణ, పోలింగ్ స్టేషన్లల్లో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఓటుహక్కు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైనవారు ఎవరూ కూడా మిస్‌కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అర్హులైన వారందరికి డోర్‌టూ డోర్ బూత్ లెవల్ అధికారులు తిరిగి పరిశీలించాలన్నారు. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులొస్తే నియోజకవర్గ ఇఆర్‌ఒ మీద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓటర్ల జాబితాను సూక్ష్మస్థాయిలో పరిశీలించి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సుమోటోగా తొలగింపులు, చేర్పులు, మార్పులకు సంబంధించిన ఓటర్ల దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. ఎన్నికలకు ఓటర్ల జాబితా గుండెకాయలాంటిదన్నారు. రాబోయే లోకసభ, సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను రాజకీయపార్టీలకు ఇస్తామన్నారు. ఎఇఆర్‌ఓలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియోట్యాగ్ చేయాలన్నారు. జిల్లాలో ప్రముఖుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి, ఫర్నీచర్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ర్యాంప్ సౌకర్యాలు ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేవిషయాలు పరిశీలించి బుధవారం సాయంత్రానికి నివేదికలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, స్ట్ఫె సిఇఒ బి రవి, మెప్మా పీడీ సింగయ్య, జిల్లావిద్యాశాఖాధికారి సుబ్బారావు, ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్టు అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.