ప్రకాశం

మోసం చేసిన కేసులో ఒకరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 21: మద్దిపాడు మండలం గుళ్ళాపల్లి గ్రామానికి చెందిన వై. నరేంద్రరెడ్డి అనే బెట్టింగ్ నిర్వాహకుడిని సోమవారం ఒంగోలు టుటౌన్ పోలీసులు అరెస్ట్‌చేసి అతని వద్ద నుండి సుమారు 23 లక్షల 70వేల రూపాయల విలువ కలిగిన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి బి సత్య ఏసుబాబు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పి సత్యఏసుబాబు ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ యేమిరెడ్డి నరేంద్రరెడ్డి అనే అతను క్రికెట్, ప్రోకబడి, షటిల్ బ్యాడ్మింటన్ గేమ్స్ ఆడతానని, వాటిలో బెట్టింగ్ నావద్ద పెట్టినట్లయితే ఎక్కువ డబ్బులు మీకు వస్తాయని నమ్మబలికి ఒంగోలులోని సంతపేటకు చెందిన చలువాది పవన్‌కుమార్ అనే వ్యక్తి నుండి 3 గోల్డు బిస్కెట్స్ 300 గ్రాములు, 20 లక్షల రూపాయలను విడతలవారీగా మోసంచేసి, బెదిరిస్తూ తీసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఇవే కాకుండా మరో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తూ ఉండగా ఫిర్యాది ఇచ్చిన రిపోర్టుతో ఒంగోలు టుటౌన్ పోలీసులు యేమిరెడ్డి నరేంద్రరెడ్డిపై 420, 406, 506 ఐపిసిగా కేసు నమోదు చేసి, ఇనె్వస్టిగేషన్ చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌పి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్‌పి, అడ్మిన్ లావణ్య లక్ష్మీ, ఒంగోలు టుటౌన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.