ప్రకాశం

ప్రత్యేకహోదా కోరుతూ టీఎన్‌ఎస్‌ఎఫ్ జలదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ందుకూరు, ఏప్రిల్ 19: ఏపీకి ప్రత్యేకహోదా వెంటనే ప్రకటించాలని కోరుతూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు బెజవాడ ప్రసాద్, కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రామాయపట్నం బీచ్‌లో గురువారం జలదీక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బెజవాడ ప్రసాద్ మాట్లాడుతూ ఐదుకోట్ల ఏపీ ప్రజలను బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ మోసం చేస్తున్నారని, రేపటి నుంచి ముఖ్యమంత్రి చేపట్టబోయే ధర్మ పోరాటదీక్షకు మద్దతుగా జలదీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని ప్రతి విద్యార్థి దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టబోయే దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో దీక్షలో పాల్గొని సంఘీభావం తెలియజేయాలని కోరారు. అలాగే రామాయపట్నంలో వెంటనే పోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసే ఈ పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు నవీన్‌కృష్ణ, నాసిర్, సునీల్, వెంకటరమణ, సాయి, కౌసిక్ తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట
ఎమ్మెల్సీ మాగుంట ప్రత్యేక పూజలు
టంగుటూరు, ఏప్రిల్ 19: టంగుటూరు గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకంలో కార్యక్రమంలో జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.