జాతీయ వార్తలు
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 December 2019
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నారు. త్వరలో జరుగనున్న ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్ సన్నద్ధం అవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించింది. మహిళలకు బస్సులు, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇందులో భాగంగా ప్రముఖ వ్యహకర్త ప్రశాంత కిషోర్ను నియమించుకుంది. ఈ మేరకు ట్విట్టర్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ తెలియజేశారు. తాము రాబోయే ఎన్నికల్లో ఇండియా ఐప్యాక్ (ప్రశాంత కిషోర్ పొలిటికల్ అడ్వయిజరీ సంస్థ)తో కలిసి పనిచేసేందుకు సంతోషిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.