రాష్ట్రీయం

రాష్టప్రతి పర్యటనకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

25న ఐ భీమవరం పర్యటన
హైదరాబాద్, డిసెంబర్ 19: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డిజిపి జెవి రాముడు మూడు జిల్లాల కలెక్టర్లతో రాష్టప్రతి పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే రెండు మార్లు సమీక్షించారు. కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో డిజిపి, సిఎస్ సమీక్షించారు. రాష్టప్రతి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకుని రాష్టప్రతి వేరే హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి ఐ భీమవరం వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 25న ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఐ భీమవరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలను ప్రారంభిస్తారు. రాష్టప్రతి షెడ్యూలులో 24, 26 తేదీల్లో మరో పర్యటన కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తిరుమల కూడా రాష్టప్రతి సందర్శించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా ఇంకా పర్యటనను ధృవీకరించలేదు.