ఆంధ్రప్రదేశ్‌

ప్రివిలేజ్ కమిటీ భేటీకి రోజా గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రివిలేజ్ కమిటీ శనివారం మధ్యాహ్నం సమావేశమైంది. ఈ రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా అయిదుగురు వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా రోజా, జ్యోతుల నెహ్రూ హాజరుకాలేదు. అస్వస్థతకు లోనై నిమ్స్‌లో చేరడంతో రోజా ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరుకాలేదు. వైకాపా ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, శ్రీధర్‌రెడ్డి మాత్రం హాజరయ్యారు. టిడిపి ఎమ్మెల్యే అనిత ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించారు. టిడిపి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. ఈ కమిటీలో టిడిపి, వైకాపాల నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు సభ్యులు సమావేశానికి రాలేదు.