జాతీయ వార్తలు
ఎల్ఐసీ విశ్వాసం కోల్పోతుంది:ప్రియాంక గాంధీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 September 2019
న్యూఢిల్లీ:దివాళతీసిన కంపెనీల్లో ఎల్ఐసీ సంస్థ నిధులను పెట్టుబడులుగా మలచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. గత రెండున్నర నెలల్లో ఎల్ఐసీ సుమారు 57వేల కోట్లు నష్టపోయినట్లు ప్రియాంకా తన ట్వీట్కు ఓ మీడియా రిపోర్ట్ను ట్యాగ్ చేసింది. భారత్లో విశ్వాసానికి మరోపేరు ఎల్ఐసీ, భవిష్యత్తు భద్రత కోసం పేద ప్రజలు తమ సొమ్మును ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ బీజేపీ ప్రభుత్వం ఆ ఎల్ఐసీ డబ్బును.. నష్టపోయిన కంపెనీల్లో పెట్టుబడి పెడుతోందని ప్రియాంకా అన్నారు. ఇదేం విధానం, ఇది కచ్చితంగా నష్టపోయే విధానమే అని కాంగ్రెస్ నేత అన్నారు.