రంగస్థలం కోసం రంగం సిద్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 14 February 2018
చరణ్ ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ తన శైలిలో తెరకెక్కించిన సినిమాలో సమంత హీయిన్గా నటించింది. అనసూయ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మార్చి 18న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ను వైజాగ్లో భారీ ఎత్తున చెయ్యాలనే ఆలోచన చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై ఇం కా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉం ది. మొదటిసారి పల్లెటూరి మాస్ గెటప్లో చరణ్ చేస్తోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి చరణ్కి సోదరుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.