రాష్ట్రీయం

బాధితులను ఆదుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, నవంబర్ 28: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీరని నష్టం జరిగినా, ప్రభుత్వం మాత్రం బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం, చిన్నకనపర్తి గ్రామాల వద్ద తెలుగుగంగ కాలువలకు పడిన గండితోపాటు వరద ముంపు ప్రాంతాల్లోనూ ఆయన కాంగ్రెస్ నేతలతో కలసి శనివారం పరిశీలించారు. చిన్నకనపర్తిలో విలేఖరులతో మాట్లాడుతూ వర్షాలకు రాష్ట్రంలో పంటలు, ఉద్యానవనాలకు భారీ నష్టం జరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. లోతట్టుప్రాంతాల వారు ఇబ్బందులకు గురయ్యారని, వీరి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశామని ప్రభుత్వం చెప్పినా బాధితులకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందాలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.