జాతీయ వార్తలు
అప్పుడు దిల్లీలో ఉన్నా: రాకీ యాదవ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 May 2016
గయ: తన కారును ఓవర్టేక్ చేశాడన్న ఆగ్రహంతో ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని తుపాకీతో కాల్చిచంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడియు ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ తాను నిర్దోషినని మీడియాకు తెలిపాడు. సంఘటన జరిగిన రోజున తాను దిల్లీలో ఉన్నానని, తన తల్లి పిలిస్తే అక్కడికి వెళ్లానని అంటున్నాడు. తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అన్ని విషయాలూ
కోర్టులోనే చెబుతానని రాకీ అంటున్నాడు. సంఘటన జరిగిన తర్వాత 48 గంటలపాటు అజ్ఞాతంలో ఉన్న రాకీని గాలించి మంగళవారం రాత్రి పట్టుకున్నామని, తుపాకీని, కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.