జాతీయ వార్తలు
రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో బెయిల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 12 July 2019
అహ్మదాబాద్: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అహ్మదాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుజరాత్లోని అహ్మద్బాద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ పటేల్ ఈ క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. రూ. 749.59 కోట్ల విలువైన రద్దయిన పెద్ద నోట్లను మార్పిడి చేయటంతో ఆహ్మదాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణానికి పాల్పడిందని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా ఆరోపించారు. దీనిపై ఆహ్మదాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్, చైర్మన్ అజయ్ పటేల్ క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. ఈ పిటిషన్పై విచారణకు హాజరుకావాల్సిందిగా మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో రాహుల్ కోర్టు ముందు హాజరయ్యారు.