జాతీయ వార్తలు
రాజకీయ ప్రయోజనాల కోసం మెరుపుదాడులు:రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 1 December 2018
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యం జరిపిన మెరుపుదాడులను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. ఆయన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ హయాంలోనే మెరుపుదాడులు జరుగలేదని, మన్మోహన్ సింగ్ హయాంలోనూ మెరుపుదాడులు జరిగాయని అన్నారు. ఆర్మీ గోప్యంగా ఉంచమన్నదని చెప్పారు. మన్మోహన్ హయాంలో మూడుసార్లు మెరుపుదాడులు జరిగాయని చెప్పారు. 20 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధిచేకూరుస్తూ వారి రుణాలను భారీ మొత్తంలో కేంద్రం రద్దుచేసిందని అన్నారు.