జాతీయ వార్తలు

మోదీపై మరోసారి రాహుల్ విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. పూల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వని ప్రభుత్వం అనిల్ అంబానీకి మాత్రం రూ.30 వేల కోట్లు కట్టబెట్టిందని అన్నారు. దేశం కోసం 40 జవాన్లు ప్రాణత్యాగం చేశారు. వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. వీరికి ప్రభుత్వం ఏమీ ఇవ్వదు. కాని ఈ వ్యక్తి (అనిల్ అంబానీకి మాత్రం)కి రూ.30 వేల కోట్లు కట్టబెట్టిందని, నవభారతానికి స్వాగతం అంటూ వ్యంగంగా ట్విట్టర్‌లో స్పందించారు. పూల్వామా ఘటన తరువాత ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటామని ప్రకటించిన ఆయన వారం రోజుల పాటు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయని రాహుల్ నేడు ఒక్కసారిగా మోదీపై విరుచుకుపడ్డారు.