జాతీయ వార్తలు

ఉత్తర భారతంలో వర్షాలకు 55మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు ఆపార అస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. ఈ వర్షాల కారణంగా మొత్తం 55 మందికి పైగా మృతి చెందారు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వర్షాలు ముంచెత్తాయి. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. కాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మంగళవారంనాడు వరద ప్రాంతాల్లో పర్యటించారు. జాతీయ విపత్తగా ప్రకటించి కేంద్రం తక్షణమే వంద కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. సోమవారంనాడు 1.43 క్యూసెక్కుల నీటిని వదలగా మంగళవారంనాటికి 205.94 మీటర్ల స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమున ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు రెండు రోజులు నుంచి కురుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సట్లేజ్ నది వరద వల్ల ఓ వంతెన కుప్పకూలింది. ఉత్తరాఖండ్‌లో వర్షాలకు 17మంది చనిపోగా.. హిమాచల్‌ప్రదేశ్‌లో సైతం 18మంది మృత్యువాతపడ్డారు. వరదలో చిక్కుకుపోయిన ఆరుగుర్ని రిస్క్యూ టీమ్ రక్షించింది. సిమ్లాలో కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది చనిపోయారు. కులూ, శ్రీమర్, సొలన్, చంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. కుండపోత వర్షాలతో కులు, సిమ్లా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హర్యానాలోని హత్నికుంద్ బ్యారెజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. యమున నీటిని దిగువకు వదిలి వేస్తున్నప్పటికీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.పంజాబ్‌లో నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఇళ్లు, చెట్లు నేలకూలాయి.