ఆంధ్రప్రదేశ్‌

బాణాసంచా పేలి: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు ప్రాంతంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి బాణాసంచా తయారుచేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సుబ్బారావుపేటలోని పూరింట్లో ముత్యాలరెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. ఈయన ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. బాణసంచా తయారుచేసి అమ్ముతుంటారు. రాత్రి బాణాసంచా తయారుచేస్తుండగా విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముత్యాలరెడ్డి భార్య సూర్యాకాంతం, కోడలు ధనలక్ష్మి, కుమారుడు వినయ్‌రెడ్డి చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.