జాతీయ వార్తలు

దేశభక్తి సందేశాన్ని ప్రచారం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతకు రాజ్‌నాథ్ పిలుపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దేశభక్తి, జాతీయ వాదం సందేశాన్ని ప్రచారం చేయాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యువతకు పిలుపునిచ్చారు. జమ్మూ, కాశ్మీర్‌నుంచి వచ్చిన విద్యార్థుల బృందంతో మంగళవారం మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ ఈ పిలుపునిచ్చారు. ‘యువతను తప్పుదోవ పట్టించే వాళ్లు కొంతమంది ఉన్నారు. వాళ్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, అంతేకాదు భారతదేశం మా దేశమని, ఎప్పటికీ అలాగే ఉంటుందనే సందేశాన్ని వారికి తెలియజేయాలి’ అని ఆయన అన్నారు. హోం మంత్రిత్వ శాఖ ‘వతన్‌కో జానో’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ పర్యటనలో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బృందంలో ఉన్న వాళ్లంతాతా 15-24 ఏళ్ల మధ్య వాళ్లు కాగా కాశ్మీర్‌కు చెందిన యువకులు దేశంలోని మిగతా పాత్రాల గురించి అవగాహన పెంపొందించుకునేలా చూడడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.