తెలంగాణ

రమ్య మృతికేసులో శ్రావెల్‌కు బెయిల్ తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంజగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యతో పాటు మరో ఇద్దరి మృతికి సంబంధించిన కేసులో నిందితుడు శ్రావెల్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించడం ఇది రెండోసారి. కేసు తీవ్రత దృష్ట్యా శ్రావెల్‌కు బెయిల్ ఇవ్వరాదని, బెయిల్ ఇస్తే అతను విదేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. కాగా, శ్రావెల్‌కు బెయిల్ వచ్చేలా హైకోర్టును ఆశ్రయించాలని అతని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.