క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 11: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందిన విషాద సంఘటన మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గంగాధర్ కథనం ప్రకారం... సిద్ధిపేట్ జిల్లా ములుగు మండల బండమైలారం గ్రామానికి చెందిన తీగుల్ల నాగభూషణం గౌడ్ కుమారులు తీగుల్ల బాలశెట్టి గౌడ్(43), తీగుల్ల శ్రీనివాస్ గౌడ్(40)లు పాలవ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరు సోదరులు ద్విచక్రవాహనంపై నగరంలోని సనత్‌నగర్ ప్రాంతంలో పాలు పోసి తిరిగి వస్తుండగా రాత్రి 11 సమయంలో మేడ్చల్ 44వ జాతీయ రహదారి అత్వెల్లి శివారు రేకుల బావి వద్ద బండమైలారం గ్రామానికి వెళ్లే వైపు మలుపు తిరుగుతుండగా తుప్రాన్ వైపు నుంచి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో బాలిశెట్టి గౌడ్ కాళ్లు విరిగిపోయి తలకు గాయాలై అధికరక్తస్రావం కావడంతో ఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. తీవ్రగాయాలకు గురైన శ్రీనివాస్ గౌడ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న బండమైలారం గ్రామస్థులు అదే రాత్రి పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు దుర్మరణం చెందడంతో మేడ్చల్ శివారులో గల బండమైలారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

కారు - బైక్ ఢీ: యువకుడి మృతి
యాచారం, నవంబర్ 11: కారు, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అనుదీప్ కథనం ప్రకారం... నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తూర్పు తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్పుల గోపి (32) మేస్ర్తి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. పని నిమిత్తం నగరానికి వెళ్లి ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామానికి సాగర్ రహదారి మీదుగా తిరుగు పయనమయ్యాడు. మంచాల మండలం ఆగపల్లి గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ అనుదీప్ తెలిపారు.