జాతీయ వార్తలు

ఏడాదిలో ఒకసారి ఉచితంగా సిబిల్‌ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇక నుంచి ఏడాదిలో ఒకసారి ఉచితంగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా(సిబిల్‌) ద్వారా క్రెడిట్‌ నివేదికను పొందవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ వెల్లడించారు. ప్రస్తుతం క్రెడిట్‌ నివేదిక పొందాలంటే సిబిల్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంది. ఇక నుంచి ఏడాదికి ఒకసారి ఉచితంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ‘వ్యక్తులకు నేరుగా క్రెడిట్‌ స్కోరుకు సంబంధించిన వివరాలను అందించేందుకు ఏర్పాట్లను సిబిల్‌ చేస్తోంది. ఈ ఏడాది చివరి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. వ్యక్తులు ఈ నివేదికలు పొందటం ద్వారా తమ రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుంది అని రాజన్‌ పేర్కొన్నారు.