రంగారెడ్డి

భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, ఫిబ్రవరి 19: సికిందరాబాద్ ఓల్డ్‌బోయిన్‌పల్లిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 30 లక్షలు వివలువ చేసే సామగ్రి దగ్ధమైంది. ఓల్డ్‌బోయిన్‌పల్లి మల్లారెడ్డి గార్డెన్స్ సమీపంలోని పద్మజ ఏజెన్సీస్ (కోల్‌కత బేస్డ్) కేబుల్స్ గోదాం ఆవరణలో చెలరేగిన మంటలు అనుమానాస్పదంగా ఉన్నాయి. గోదాం పక్కనే చెత్త,చెదారం ఉండడంతో మంటలు అంటుకొని ప్లాస్టిక్ కేబుళ్లకు వ్యాపించినట్టు తెలుస్తోంది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. భారీ ఆస్తి నష్టం జరగడంతో ఇవి చెత్త మంటలు కావని..ఎవరైనా కావాలని గోదాంను తగులబెట్టే ప్రయత్నం చేశారా? అనే కోణం నుంచి దర్యాప్తు జరుగుతుంది. ఆదివారం సాయంత్రం చెలరేగిన మంటలను ఐదు ఫైరింజన్లు అదుపులోకి తేగా, రాత్రి వరకూ మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.