ఆంధ్రప్రదేశ్‌

అన్నదానంలో రియో రికార్డును బద్దలుకొట్టాం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రియో ఒలంపిక్స్‌లో రోజుకు 50వేల మందికి ఆహారం అందించారని, అయితే విజయవాడ బస్టాండ్ పుష్కరనగర్ దగ్గర ఆదివారం ఒక్కరోజే 2 లక్షల మందికి అన్నదానం చేశామని, ఇది ప్రపంచ రికార్డని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పుష్కరాల్లో రోజుకు లక్షన్నరమందికి అన్నదానం చేశామని చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో అన్నదానం, పరిశుభ్రత వివరాలను గిన్నిస్ బుక్‌కు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు.
‘కృష్ణమ్మ పవిత్ర హారతి’ సందర్భంగా మంగళవారం ఇబ్రహీంపట్నం కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని పోలీసున్నాధికారులను ఆదేశించారు. ఘాట్లను పర్యాటకంగా అభివృద్ది చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.