జాతీయ వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. యెలహంకలోని కొగిలి క్రాస్ రోడ్డు వద్ద కారు, అంబులెన్స్ ఢీకొనటంతో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపక్ కుటుంబ సభ్యులు చెన్నైలో ఉంటున్నారు. వీరు తమ బంధువులను కలుసుకునేందుకు సోమవారం రాత్రి బెంగళూరు వస్తుండగా కొగిలి క్రాసింగ్ వద్ద దీపక్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొన్నది. ఈ ఘటనలో దీపక్, సంజయ్, ఇదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.