తెలంగాణ

రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి, తెలంగాణల్లో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, మెదక్ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా రుద్రారం వద్ద వేగంగా వెళుతున్న లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో ఒకరు మరణించగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండగా ఓ ఆటోను లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ఆగి ఉన్న కారును లారీ ఢీకొనడంతో అయిదుగురు, అదే జిల్లాలో రేణంగివరం వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మరణించారు.