జాతీయ వార్తలు
రోహిత్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ :స్మృతీ ఇరానీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 January 2016
ఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. రోహిత్ మృతి ఘటనపై ఆమె వివరణ ఇస్తూ ప్రెస్మీట్ నిర్వహించారు. వాస్తవాలు తెలుసుకోకుండా దళిత, దళితేతర మధ్య వివాదంగా కొంతమంది విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఆత్మహత్య లేఖలో రోహిత్ తన ఆత్మహత్యకు ఫలానావారు బాధ్యులు అని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. ఈ ఘటనలో సమగ్ర విచారణ జరిగితే నిజనిజాలు వెల్లడవుతాయని అన్నారు.