వరంగల్
ప్రజా చైతన్య యాత్ర బహిరంగసభకు భారీ ఏర్పాట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వికారాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోమవారం చేవెళ్ళ నుండి ప్రారంభించి వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న ప్రజా చైతన్య యాత్రకు, బహిరంగసభకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లుచేశారు. జిల్లా కేంద్రం ప్రారంభమయ్యే కొత్రెపల్లి నుండి రోడ్డు కిరువైపులా కాంగ్రెస్ జెండాలు, భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. బహిరంగసభ ఏర్పాట్లను స్వయంగా ప్రసాద్కుమార్ పర్యవేక్షిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి హాజరవుతున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏ.సుధాకర్రెడ్డి, కే.అనంత్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఎల్.శశాంక్రెడ్డి, పటేల్ సంగమేశ్వర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీ.రాజశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు స్వరాజ్కుమార్, ఇక్బాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, యువజన కాంగ్రెస్ నాయకులు సుభాన్రెడ్డి, వెంకట్రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చామల రఘుపతిరెడ్డి, సీ.రామస్వామి, పట్టణ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీనివాస్ ముదిరాజ్లు శాయశక్తులా కృషి చేస్తున్నారు.