రంగారెడ్డి

ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, సెప్టెంబర్ 17: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా బీజేపీ తెలంగాణ విమోచన కమిటి చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం పాట్లు పడుతున్న ప్రభుత్వం నేడు విమోచన దినోత్సవం అధికారంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వందలమంది ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తులు సీఎం కేసీఆర్‌కు గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మురళీ, ఇస్నాతి శ్రీనివాస్, శేరివిష్ణువర్ధన్ రెడ్డి, పీ.కృష్ణారెడ్డి, చెంది మహేందర్ రెడ్డి, పెంటయ్య, పాండు రంగారెడ్డి, అనిల్, మహేష్ పాల్గొన్నారు.

కొత్తూరు: కొత్తూరు, నందిగామ మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో అశోక్ గౌడ్, నాగరాజుచారి, ఎంపిటిసి సభ్యుడు ఎ.నర్సింహా గౌడ్, విష్ణు, శ్రీనివాస్, సురేందర్ గౌడ్, రాజు, మల్లేష్ పాల్గొన్నారు.